కన్నతల్లి శవాన్ని ముక్కలు చేసి దాచిపెట్టి దుర్వాసన రాకుండా ఎయిర్ ఫ్రెషనర్స్ వాడిన కూతురు..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 22 March 2023, 12:00 pm

సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న సంఘటనలు ప్రాణాలు తీసే రీతిలో పరిస్థితులు దాపరిస్తున్నాయి. ఇదే సమయంలో పిల్లలు తల్లిదండ్రులను, తల్లిదండ్రులు పిల్లలను చంపేస్తున్నారు. ఈ రీతిగానే ముంబైలో లాల్ బాగ్ చాల్ లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తల్లిని ముక్కలు ముక్కలుగా దాదాపు 5 ముక్కలు చేసింది కూతురు. పూర్తి వివరాల్లోకి వెళితే వీణ, ప్రకాష్ జైన్ ల కుమార్తె రింపుల్. గత కొంతకాలంగా తల్లి వీణతో కలిసి రింపుల్ తమ సొంత నివాసంలో ఉంటున్నారు. వీళ్ళకి సాండ్ విచ్ వ్యాపారం ఉంది. రింపుల్ వయసు 24 సంవత్సరాలు. ఆమె తల్లి వినవయసు 55. తండ్రి చాలా సంవత్సరాల క్రితం చనిపోయాడు. అయినా గాని జీవితంలో పెద్ద కష్టాలు ఏమీ లేవు. అలా అని డబ్బులు కూడా పెద్దగా ఏమీ లేవు.

సాండ్ విచ్ తయారుచేసి ఇస్తే తల్లి వీణ అమ్మేది. జీవితం అలా సాఫీగా గడుస్తుంది అంతే. వీణకు… 60 సంవత్సరాల వయసు కలిగిన అన్నయ్య సాయంగా ఉండేవాడు. వీణ భర్త చనిపోయిన నాటినుండి ఆమెకు ఆర్థికంగా అండగా ఉంటూ తోడుగా ఉంటున్నాడు. రింపుల్ చాలా తెలివైన అమ్మాయి అందంగా ఉండటంతో తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలని వీన అన్నయ్య అనుకున్నాడు. ఇక ఇదే సమయంలో రింపుల్ సైతం తన బావని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇద్దరికీ పెళ్లి నిశ్చయమైంది ఎంగేజ్మెంట్… చేయడానికి వీణ సోదరుడు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. దీంతో రింపుల్ ఆమె బావ సినిమాలు షికార్లకు తిరిగేవాళ్లు. అయితే మూడు నెలల నుంచి రింపుల్ తీరు పూర్తిగా మారిపోయింది. బావతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదు. ఇంటి నుండి బయటకు రావాలని కోరిన గాని రావడం లేదు.

the daughter who dismembered the dead body of her mother in mumbai

the daughter who dismembered the dead body of her mother in mumbai

అమ్మకు బాగాలేదు ఇంటిలోనే ఉండాలి అని వంక చెబుతోంది. దీంతో వేన అన్నయ్య ఇంటిలో కెల్లాలని ప్రయత్నం చేసిన ఏదైనా ఇవ్వాలన్న గాని కిటికీలో పెట్టేయండి తీసుకుంటామని లోనున్న రింపుల్ బదిలిస్తుంది. దీంతో వీణ అన్నయ్యకి చాలా డౌట్ రావడంతో పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. పోలీసులు చాలా బలవంతంగా తలుపులు బాధడం జరిగింది. లోపలికి వెళ్ళాక ఇల్లు మొత్తం చంద్రబాబు ఉండటంతో పాటు దుర్వాసన రావడం జరిగింది. ఎక్కడికక్కడ రక్తపు మడుగులో ఉన్నాయి. లోన ఒక భయంకరమైన వాతావరణంలో మూడు నెలలపాటు రింపుల్ ఉంది. దీంతో వేణు గురించి పోలీసులు ఆరాధించడం జరిగింది.. ఆమె తల్లి చనిపోయినట్లు విచారణలో తెలిపింది.

మెట్ల పైనుంచి జారిపడి మరణించినట్లు చెప్పుకొచ్చింది. దీంతో ఖననం చేయడం కానీ ఇంట్లోనే మృతదేహాన్ని దాచినట్లు పోలీసుల విచారణలో స్పష్టం చేసింది. అంతేకాదు తల్లి మృతదేహాన్ని ప్రతిరోజు మొక్కలు ముక్కలుగా చేసి కొన్ని శరీర అవయవ భాగాలు బయటపడేసినట్లు కూడా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో మృతదేహం నుండి దుర్వాసన రాకుండా టీ ఆకులు ఫినాయిల్ సుమారు 40 బాటిల్ల ఎయిర్ ఫ్రెషనర్ లు ఉపయోగించినట్లు పోలీస్ విచారణలో ఒప్పుకొంది. ఒళ్ళు గగుర్పాటు చేయు సంఘటన ముంబైలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా సంచారం సృష్టించింది. ఇంకా ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతూ ఉంది. రింపుల్ పోలీసుల కస్టడీలో ఉంది.

Advertisement

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి