Categories: ExclusiveNewssports

Sachin Tendulkar : పులుల‌ని సంర‌క్షించ‌డం మ‌న బాధ్య‌త‌.. వాటిని కాపాడాల్సిన అస‌వ‌రం ఉంద‌న్న సచిన్ టెండూల్క‌ర్..!

Sachin Tendulkar : మాస్టర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్క‌ర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. క్రికెట్ దేవుడిగా పేరు తెచ్చుకున్న స‌చిన్ క్రికెట్‌లో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసాడో మ‌నంద‌రికి తెలిసిందే. అయితే సచిన్‌ తెందుల్కర్‌లో మరో కోణం కూడా ఉంది. అటవీ జంతువులన్నా ముఖ్యంగా పులుల పట్ల ఎంతో అభిమానం చూపిస్తుంటారు. నాగ్‌పూర్‌లోని తాడోబా టైగర్‌ రిజర్వ్‌ పార్క్‌లో ఒక‌సారి త‌న కుటుంబసభ్యులతో పర్యటించారు స‌చిన్. పులులతో గడిపిన క్షణాలను వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్‌ చేయగా దానికి విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.మహారాష్ట్ర చంద్రపూర్‌ జిల్లా తడోబా అభయారణ్యంలో స‌చిన్ కుటుంబ సమేతంగా పర్యటించారు. భార్య అంజలి, సోదరి, మరో మాజీ క్రికెటర్‌ ప్రశాంత్‌ వైద్య, ఇతర మిత్రులతో కలసి, ముంబై నుంచి నాగ్‌పూర్ వెళ్లారు. అనంత‌రం తాడోబా అంధారి టైగర్ వెళ్లారు. . తొలిసారిగా 2020 జనవరి 26న భార్య అంజలి, కుమారుడు అర్జున్‌తో, ఆ త‌ర్వాత న తన తల్లి, మిత్రులతో వెళ్లారు.

Sachin Tendulkar పులులు సంర‌క్షించాలి..

మూడు జ‌న‌రేష‌న్ పులులని కూడా ఆయ‌న చూపించారు.. ప్రపంచ అటవీ జంతువుల దినోత్సవం 2021 సందర్భంగా , తాడోబా అభయారణ్యంలో పులులతో గడిపిన క్షణాలను వీడియోగా తీసిన సచిన్‌ గతంలో ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో పాటు ఆ పర్యటన విశేషాలను సచిన్‌ డీటైల్డ్‌గా వివరించారు.ఈ రోజు అంత‌ర్జాతీయ పులుల సంద‌ర్భంగా స‌చిన్ వీడియో వైర‌ల్ అవుతుంది.ఇక ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో భారతదేశంలో మొత్తం 628 పులులు మరణించాయి. చాలా వరకూ సహజ మరణాలు కాగా.. కొన్ని వేట, ఇతర కారణాల వల్ల మరణించాయి. అదే సమయంలో పులుల దాడిలో 349 మంది మరణించారు, ఒక్క మహారాష్ట్రలోనే 200 మరణాలు నమోదయ్యాయి.

Sachin Tendulkar : పులుల‌ని సంర‌క్షించ‌డం మ‌న బాధ్య‌త‌.. వాటిని కాపాడాల్సిన అస‌వ‌రం ఉంద‌న్న సచిన్ టెండూల్క‌ర్..!

ఉత్తరప్రదేశ్‌లో పులుల దాడిలో 59 మంది చనిపోగా, మధ్యప్రదేశ్‌లో 27 మంది మరణించారు. భారతదేశంలో మొత్తం పులుల సంఖ్య 3,682 గా ఉంది. ప్రపంచంలోని పులుల జనాభాలో దాదాపు 75 శాతం భారత్ లోనే ఉన్నాయి. పులుల సంరక్షణను ప్రోత్సహించడానికి భారతదేశం ఏప్రిల్ 1, 1973న ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించింది. మొదట 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తొమ్మిది టైగర్ రిజర్వ్‌లను కవర్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో 78,735 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువగా 55 టైగర్ రిజర్వ్ లు ఉన్నాయి.

Recent Posts

Vastu Tips : మీ ఇంట్లో ఈ తప్పులు చేస్తే… రాహు దోషం మిమ్మల్ని వెంటాడడం తద్యం…?

Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…

42 minutes ago

Kingdom Movie Review : కింగ్‌డ‌మ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌న్ మ్యాన్ షో..!

kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse ,  హీరోగా నటించిన…

2 hours ago

Pumpkin : ఈ 3 రకాల గుమ్మడికాయలలో… ఏది ఆరోగ్యానికి మంచిది…?

Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…

3 hours ago

Kingdom Movie Review : కింగ్‌డ‌మ్ మూవీ ట్విట్ట‌ర్ రివ్యూ.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఖాతాలో హిట్ ప‌డ్డ‌ట్టేనా ?

Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…

4 hours ago

Tea : పొరపాటున మీరు టీ తో పాటు ఈ ఆహారాలను తినకండి… చాలా డేంజర్…?

Tea : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో మన శరీరం వెచ్చదనాన్ని వెతుక్కుంటుంది. మన శరీరం వేడిగా…

5 hours ago

Raksha Bandhan : రాఖీ పండుగ రోజు… మీ రాశి ప్రకారం ఈ రంగుల దుస్తులను ధరిస్తే… మీ బంధం బలపడుతుంది…?

Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…

6 hours ago

Indiramma Houses : ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ ఇళ్ల‌కు శంకుస్థాపన

Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…

12 hours ago

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ ఎద ఎత్తులకి ఫిదా అవుతున్న కుర్ర‌కారు.. మైండ్ బ్లాక్ అంతే..!

Janhvi Kapoor  : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…

15 hours ago