KCR : మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో అలజడి.. కేసీఆర్ కు వైఎస్ జగన్ మద్దతు.. అలా చేస్తే ఏపీ ప్రజలు క్షమిస్తారా?

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 14 September 2022, 7:30 am

KCR : మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో అలజడి మొదలైంది. మరోసారి రెండు రాష్ట్రాలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఉమ్మడి ఏపీగా ఉన్న రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో.. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయి కూడా తొమ్మిదేళ్లు అవుతోంది. అప్పటి నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ మాత్రం ఆకాశమే హద్దు అన్నట్టుగా అభివృద్ధిలో ముందంజలో ఉంది. కానీ.. ఏపీలో మాత్రం సరైన రాజధానే లేదు. టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని అంటే… వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చి మూడు రాజధానులు అంటే.. ప్రత్యేక ఏపీ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు కావస్తున్నా ఒక రాజధాని లేదు.. ఏదీ లేదు.

ఓవైపు తెలంగాణ అభివృద్ధిలో టాప్ లో ఉంటే.. ఏపీలో మాత్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదనేది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. అయితే.. ఉమ్మడి ఏపీని విడదీసి.. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ ను డెవలప్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆంధ్రులను మోసం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన పనిపై ఆంధ్రా ప్రజల్లో చాలా కోపం ఉంది. రెండు రాష్ట్రాలను విడదీసిన పాపం ఆయనదే అంటున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారు. జాతీయ రాజకీయాలు అంటేనే డైరెక్ట్ గా ప్రధాని మోదీని ఢీకొట్టడం.

will ap people accept telangana cm kcr

will ap people accept telangana cm kcr

KCR : తెలంగాణ మంత్రి బహిరంగంగానే ఎందుకు చెప్పినట్టు?

ప్రధాని మోదీకి ఇక్కడ ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం పరోక్షంగా అన్ని విషయాల్లో సహకరిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మద్దతు ఇస్తారా? అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. మెజారిటీ ఏపీ ప్రజలు మాత్రం ఇవ్వకూడదు అనే కోరుకుంటున్నారు. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మాత్రం ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ మద్దతు.. కేసీఆర్ కు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పారు. నిజానికి.. కేసీఆర్ ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తెస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ను ఏర్పాటు చేసి కేంద్రంలో ఆ ఫ్రంట్ ను అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని మోదీని కాదని సీఎం జగన్.. కేసీఆర్ కు మద్దతు ఇస్తారా? అనేదే తెలియాల్సి ఉంది. ఒకవేళ మద్దతు ఇస్తే ఏపీ ప్రజలు ఊరుకుంటారా? వాళ్లు క్షమిస్తారా? ఒకవేళ సీఎం జగన్.. కేసీఆర్ కు మద్దతు ఇవ్వాలనుకుంటే ఏపీ ప్రజల నుంచి వ్యతిరేకత మాత్రం తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

  1. "Korean Kanakaraju Movie : ‘కొరియన్ కనకరాజు’పై పెరుగుతున్న అంచనాలు.. వరుణ్ తేజ్ కంబ్యాక్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుందా?"

  2. "Ys Jagan : జగన్ ఇంకా మోడీ దత్తపుత్రుడేనా? ..ఏపీ రాజకీయాల్లో మళ్లీ మొదలైన ఆసక్తికర చర్చ..!"

  3. "Bhuma Akhila Priya : అఖిలప్రియకు సవాల్‌గా తమ్ముడు?.. ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ?"

  4. "Vijayasai Reddy : విజయసాయిరెడ్డి కొత్త అడుగు.. రాజకీయాల్లో మరో సంచలనం?"

  5. "Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా ?.. వైరల్ అవుతున్న ధనరాజ్ భార్య వ్యాఖ్యలు.."

  6. "Udhayanidhi Stalin : త్రిష వివాదంలో ఉదయనిధికి లీగల్ షాక్.. కేసు నమోదు, తమిళనాడులో రాజకీయ రగడ.."

  7. "Bengaluru : బెంగళూరులో షాకింగ్ ఘటన .. వ్యక్తిగత ఫోటోల లీక్ .. అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్లతో మహిళకు నరకం"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp