ఆన్‌లైన్‌లో రూ.300 కోసం 2 ల‌క్ష‌లు మోస‌పోయిన మ‌హిళ‌

Authored By Admin | The Telugu News | Published on: June 6, 2021, 1:35 pm

హైద‌రాబాద్ చెందిన మ‌హిళ ఓ కొరియ‌ర్ సంస్థ చేతిలో మోస‌పోయింది. రూ 300 కోసం త‌ను 2 ల‌క్ష‌లు పోగొట్టుకుంది. ఆ మ‌హిళ త‌న‌కు జ‌రిగిన మోసాన్ని సైబ‌ర్ క్రైమ్‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. హైద‌రాబాద్‌లో నివాసం ఉంటున్న ఉషారాణి ఆన్‌లైన్‌లో ఓ వ‌స్తువు బుక్ చేసింది. అయితే వ‌స్తువు తీసుకోచ్చిన కొరియ‌ర్ బాయ్ ఆ కొరియ‌ర్ ఇచ్చి ఉషారాణి వ‌ద్ద త‌న‌కు రావాల్సిన దాని క‌న్నా రూ 300 ఎక్కువ తీసుకోని వెళ్లిపోయాడు.

కొరియ‌ర్ సంస్థ ఉద్యోగి భారీ మోసం..

దీంతో ఉషారాణి ఆ కొరియ‌ర్ సంస్థ‌కు సంబ‌దించిన కాల్ సెంట‌ర్‌కి ఫోన్ చేసింది. ఆ కొరియ‌ర్ సంస్థ ఉద్యోగి ఉషారాణి ఆమ‌య‌క‌త్వాన్ని అదునుగా తీసుకొనొ భారీ మోసానికి పాల్ప‌డ్డాడు. అయితే ఆ ఉద్యోగి రూ.300 మీ అంకౌంట్‌లో వేస్తామ‌ని దాని ముందు మీరు మీ అకౌంట్ వివ‌రాలు పంపాల్సింగా ఉషారాణి కి సూచించాడు. మీ అటౌంట్ వివ‌రాలు మేము పంపే అప్లికేష‌న్ ఫిల్ చేసి పంపించాల్సిందిగా ఆ ఉద్యోగి ఉషారాణికి సూచించాడు.

Women cheating by courier person

Women cheating by courier person

అత‌ని మాట‌లు నిజ‌మే అనుకొని ఉషారాణి అలానే చేసింది. త‌ర్వాత ఉషారాణి అకౌంట్ నుండి రూ.91 వేలు డిపాజిట్ అయ్యాయి. ఉషారాణి త‌న అకౌంట్ నుండి డ‌బ్బులు భారీగా క‌ట్ అవ్వ‌డంతో షాక్ గురై మ‌రో సారి ఆ కొరియ‌ర్ సంస్థ‌కు కాల్ చేసింది. ఆ సంస్థ ఉద్యోగి ఉషారాణితో మీ వివ‌రాలు త‌ప్పుగా ఎంట్రీ చేశారు మ‌రో సారి క‌రెక్ట్ చేసి పంపండి అన్నాడు. ఉషారాణి మ‌ళ్లీ అలానే చేసింది దీంతో మ‌రోసారి రూ.99 వేలు అకౌంట్ నుండి మ‌ళ్లీ క‌ట్ అయ్యాయి. దీంతో ఆ మ‌హిళ ఖాతాలో రెండు సార్లు రూ 1.90 వేలు మోస‌పోయింది. దీంతో ఆ మ‌హిళ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.

Admin

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp