YCP leaders are turning against YS Jagan decision
YS Jagan : అది ఏ పార్టీ అయినా.. ఆ పార్టీ అధినేతను ధిక్కరించే దమ్ము ఆ పార్టీ నేతలకు ఉంటుందా? అస్సలు ఉండదు. అధినేత ఏం చెబితే అది చేయాల్సిందే. లేకపోతే వాళ్లకు మనుగడ ఉండదు. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. అలాంటివి ఎన్నో ఘటనలు మనం ఇప్పటి వరకు చూశాం. అయితే.. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ.. ఇటీవల కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 63 కులాలు ఉండగా.. అందులో 56 కులాలకు గాను కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఇది వరకు తక్కువ కార్పొరేషన్లు ఉండేవని.. ఇప్పుడు చాలా కార్పొరేషన్లను పెంచామని,
సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకే కార్పొరేషన్లను పెంచామని.. వాటి ద్వారా ఆయా వర్గాలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకొచ్చారు సీఎం జగన్. కానీ.. అసలు వాస్తవ పరిస్థితి మాత్రం అది కాదట. ఎందుకంటే.. పేరుకు కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు కానీ.. వాటికి ఎలాంటి నిధులు లేవని.. కేవలం చైర్మన్లను నియమించారు తప్పితే.. ఎలాంటి మౌలిక వసతులు లేవని కార్పొరేషన్ చైర్మన్లు మొత్తుకుంటున్నారు. అసలే త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ.. కార్పొరేషన్లను అడ్డం పెట్టుకొని వైసీపీ ప్రజలను తన వైపునకు తిప్పుకోవాలని చూస్తోందా?
YCP leaders are turning against YS Jagan decision
అనేది తెలియదు కానీ.. ఆయా సామాజిక వర్గాలను మాత్రం ఏకీకృతం చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి.. గత బడ్జెట్ లో కార్పొరేషన్లకు కోట్ల రూపాయలను కేటాయించారు కానీ.. ఆ నిధులు ఏమయ్యాయో ఎవ్వరికీ తెలియదు. పేరుకు ప్రతి సామాజిక వర్గానికి ఇంత అని కేటాయించారు కానీ.. ఆ నిధులు మాత్రం ఆ సామాజిక వర్గ అభివృద్ధి కోసం ఏనాడూ వినియోగించిన దాఖలాలు మాత్రం లేవు. అసలు.. నిధులే లేకుండా.. కార్పొరేషన్లను పట్టించుకోకుండా వచ్చే ఎన్నికల్లో జనాలకు ఏం సమాధానం చెబుతారు అంటూ కార్పొరేషన్ చైర్మన్లు సీఎం జగన్ పై చిర్రుబుర్రులాడుతున్నారట. చూద్దాం మరి భవిష్యత్తులో ఇంకేం జరుగుతుందో?
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.