YS Jagan : అది ఏ పార్టీ అయినా.. ఆ పార్టీ అధినేతను ధిక్కరించే దమ్ము ఆ పార్టీ నేతలకు ఉంటుందా? అస్సలు ఉండదు. అధినేత ఏం చెబితే అది చేయాల్సిందే. లేకపోతే వాళ్లకు మనుగడ ఉండదు. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. అలాంటివి ఎన్నో ఘటనలు మనం ఇప్పటి వరకు చూశాం. అయితే.. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ.. ఇటీవల కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 63 కులాలు ఉండగా.. అందులో 56 కులాలకు గాను కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఇది వరకు తక్కువ కార్పొరేషన్లు ఉండేవని.. ఇప్పుడు చాలా కార్పొరేషన్లను పెంచామని,
సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకే కార్పొరేషన్లను పెంచామని.. వాటి ద్వారా ఆయా వర్గాలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకొచ్చారు సీఎం జగన్. కానీ.. అసలు వాస్తవ పరిస్థితి మాత్రం అది కాదట. ఎందుకంటే.. పేరుకు కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు కానీ.. వాటికి ఎలాంటి నిధులు లేవని.. కేవలం చైర్మన్లను నియమించారు తప్పితే.. ఎలాంటి మౌలిక వసతులు లేవని కార్పొరేషన్ చైర్మన్లు మొత్తుకుంటున్నారు. అసలే త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ.. కార్పొరేషన్లను అడ్డం పెట్టుకొని వైసీపీ ప్రజలను తన వైపునకు తిప్పుకోవాలని చూస్తోందా?
అనేది తెలియదు కానీ.. ఆయా సామాజిక వర్గాలను మాత్రం ఏకీకృతం చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి.. గత బడ్జెట్ లో కార్పొరేషన్లకు కోట్ల రూపాయలను కేటాయించారు కానీ.. ఆ నిధులు ఏమయ్యాయో ఎవ్వరికీ తెలియదు. పేరుకు ప్రతి సామాజిక వర్గానికి ఇంత అని కేటాయించారు కానీ.. ఆ నిధులు మాత్రం ఆ సామాజిక వర్గ అభివృద్ధి కోసం ఏనాడూ వినియోగించిన దాఖలాలు మాత్రం లేవు. అసలు.. నిధులే లేకుండా.. కార్పొరేషన్లను పట్టించుకోకుండా వచ్చే ఎన్నికల్లో జనాలకు ఏం సమాధానం చెబుతారు అంటూ కార్పొరేషన్ చైర్మన్లు సీఎం జగన్ పై చిర్రుబుర్రులాడుతున్నారట. చూద్దాం మరి భవిష్యత్తులో ఇంకేం జరుగుతుందో?
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.