Pulivendula ZPTC : పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక… తగ్గేదేలే అంటున్న వైసీపీ – కూటమి పార్టీలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pulivendula ZPTC : పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక… తగ్గేదేలే అంటున్న వైసీపీ – కూటమి పార్టీలు

 Authored By ramu | The Telugu News | Updated on :9 August 2025,9:30 pm

ప్రధానాంశాలు:

  •  పులివెందుల లో కాకరేపుతున్న జడ్పీటీసీ ఉపఎన్నిక

  •  పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక... తగ్గేదేలే అంటున్న వైసీపీ - కూటమి పార్టీలు

Pulivendula ZPTC : ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత అత్యంత ఉత్కంఠ రేపుతున్న ఎన్నికగా పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక నిలిచింది. ఈ ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) దివంగత జడ్పీటీసీ కుమారుడు హేమంత్ రెడ్డిని బరిలోకి దింపింది. దీనికి పోటీగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని నిలిపారు. మొదట సానుభూతి ఓట్లు హేమంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటాయని భావించినా, కూటమి ఈ ఎన్నికను హోరాహోరీగా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఆగస్టు 12న జరగబోయే ఈ ఎన్నిక కోసం ప్రచారం రేపటితో ముగియనుంది.

Pulivendula ZPTC పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక తగ్గేదేలే అంటున్న వైసీపీ కూటమి పార్టీలు

Pulivendula ZPTC : పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక… తగ్గేదేలే అంటున్న వైసీపీ – కూటమి పార్టీలు

Pulivendula ZPTC : పులివెందుల జడ్పీటీసీ విజయం కోసం వైసీపీ కసరత్తులు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో చిన్న ఎన్నిక గెలిచినా అది తమ విజయంగా భావించి ప్రచారం చేసుకోవచ్చని భావించిన టీడీపీ కూటమి, ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ చేతిలో ఓడిపోయిన బీటెక్ రవి భార్యను పోటీలో నిలపడం ద్వారా ఈ ఎన్నికకు ప్రాధాన్యతను పెంచింది. ఈ కారణంగా, ఇది సాధారణ జడ్పీటీసీ ఉపఎన్నిక కాకుండా, రెండు ప్రధాన పార్టీల మధ్య ఒక ప్రతిష్టాత్మక పోరుగా మారింది.

అయితే, స్థానికంగా ఉన్న పరిస్థితులు, సమీకరణాలను బట్టి చూస్తే వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి గెలుపు లాంఛనమే అన్న చర్చ జరుగుతోంది. కానీ టీడీపీ కూటమి మాత్రం చివరి నిమిషంలో కూడా పట్టు వదలడం లేదు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, మంత్రులు కొలుసు పార్థసారథి, సవిత, స్థానిక ఎమ్మెల్యే మాధవీరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవితో పాటు పలువురు సీనియర్ నేతలను రంగంలోకి దించి ప్రచారం చేయిస్తున్నారు. ఒక జడ్పీటీసీ ఉపఎన్నిక కోసం ఇంత మంది ప్రముఖ నేతలు ప్రచారం చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కావడం ఈ ఎన్నిక ప్రాధాన్యతను చాటి చెబుతోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది