
ys jagan mohan reddy thinking about council chairman
ఏపీలో మండలిని రద్దు చేయాలన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు వైకాపా నాయకులు ఇప్పుడు మండలి కొనసాగాలనే స్థాయికి వచ్చారు. ఎందుకంటే వైకాపా అధికారంలోకి వచ్చిన కొత్తలో మండలిలో ఆ పార్టీ బలం సింగిల్ డిజిట్ మాత్రమే. దాంతో ప్రతి బిల్లు కూడా మండలిలో వెనక్కు వస్తూ ఉండటంతో జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. దాంతో ఒకానొక సమయంలో మండలిని రద్దు చేసేందుకు అసెంబ్లీలో బిల్లును కూడా తీసుకు వచ్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మండలిని కొనసాగించేందుకు ఆసక్తిగా ఉంది. మండలి ని రద్దు చేయాలనే ఆలోచన చేయడం లేదు. మండలిలో బలా బలాలు తారు మారు అయ్యాయి. దాంతో జగన్ ఇప్పుడు చైర్మన్ పదవిలో ఎవరిని కూర్చోబెట్టాలనే విషయమై చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
ys jagan mohan reddy thinking about council chairman
ఎమ్మెల్యే.. స్థానిక సంస్థల కోటాలో భారీగా వైకాపా ఎమ్మెల్సీలు సభలో అడుగు పెట్టే అవకాశం ఉంది. మండలిలో జూన్ నాటికి 30 మందికి పైగా వైకాపా ఎమ్మెల్సీలు ఉండబోతున్నారు. మొత్తం 58 ఎమ్మెల్సీలో మెజార్టీ వైకాపా ఉండబోతున్నారు. ఈ ఏడాది చివరి వరకు తెలుగు దేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీల సంఖ్య చాలా వరకు తగ్గబోతుంది. ఇక ప్రస్తుతం మండలి చైర్మన్ గా ఉన్న షరీఫ్ పదవి కాలం మే 24 తో ముగియబోతుంది. దాంతో ఆ స్థానంలో కొత్త ఎమ్మెల్సీ గా వైకాపా సభ్యుడు ఎంపిక అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈమద్య కాలంలో ఎక్కువగా బీసీలకే ప్రాముఖ్యత ఇస్తున్నాడు. కనుక ఈ చైర్మన్ పీఠంపై కూడా బీసీ లేదా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్సీని కూర్చోబెట్టే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం సభలో ఉన్న వారు కాకుండా పలువురు కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎంపిక కాబోతున్నారు. వారిలో చాలా మందికి కూడా అవకాశం ఉంది. కనుక ఇప్పటి నుండే ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం చాలా మంది కాచుకు కూర్చున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చలు జరిపి చాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Allu Sneha Reddy : అల్లు వారింట్లో పెళ్లి సందడి మొదలైంది. మెగా హీరో అల్లు శిరీష్ తన ప్రియురాలు…
Modi : తమిళనాడు Tamil Nadu దివంగత సిఎం, అన్నాడిఎంకే వ్యవస్థాపకురాలు జయలలితపై ప్రధాని నరేంద్ర మోడీ Modi ప్రసంశల…
PM Kisan : కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. వివరాల…
Hyderabad: తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తన తదుపరి లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్…
YSRCP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. మొన్నటి…
Pension : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్ధిదారులకు సంతోషకరమైన వార్త తెలియజేసింది. మార్చి 1, 2026 ఆదివారం…
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్–పాక్ మధ్య అణు యుద్ధం…
Punarvika : అరుదైన వ్యాధితో పోరాడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన 11 నెలల చిన్నారి పునర్వికకు సోషల్ మీడియా వేదికగా…
IND vs ZIM : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో టీమిండియా పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఇకపై…
AP : ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో వివాహం చేసుకోవాలనే ఆశతో ఓ…
Farmers Motivation: మహీంద్రా గ్రూప్ చైర్మన్ మహీంద్రా గ్రూప్కు నాయకత్వం వహిస్తున్న ఆనంద్ మహీంద్రా సోమవారం మరోసారి ప్రేరణాత్మక సందేశంతో…
Gold and Silver Rates Today 25 Feb 2026 పసిడి ప్రియులకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి.…
This website uses cookies.