center approves 56415 crores to 16 states for capital investment 2
YS Jagan : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోషారి షాక్ ఇచ్చింది కేంద్ర సర్కార్. పోలవరం ప్రాజెక్టు విషయంలో వైఎస్.జగన్ సర్కార్ కు ఝలక్ ఇచ్చింది. డిజైన్లు మార్చినప్పటికీ.. 2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ పనులకు అంచనా వేసిన వ్యయాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపింది. పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ల మార్పుల వల్ల హెడ్ వర్క్స్ వ్యయం 5,535 కోట్ల రూపాయల నుంచి 7,192 కోట్ల రూపాయలకు పెరిగినట్లుగా ఏపీ ప్రభుత్వం తెలిపినట్టుగా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. గోదావరి ట్రైబ్యునల్ నియమ, నిబంధనలకు లోబడే ప్రాజెక్టు డిజైన్లు ఉండాలని అన్నారు. వాటిని సీడబ్ల్యూసీ ఆమోదించాకే ఆచరణలో పెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఏపీ కోరిక మేరకు ప్రాజెక్టులోని కొన్ని డిజైన్లకు సీడబ్ల్యూసీ మార్పులు చేసిందని తెలిపారు. మార్పుల కారణంగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల ఎత్తు పెంచడం, పునాదుల లోతు పెంచడం, స్పిల్వేలోని అత్యంత లోతైన బ్లాకులలో కాంక్రీట్ గ్రేడ్ల పెంపు, ఎగువ కాఫర్ డామ్లో ఎడమ వైపు డయాఫ్రం వాల్తో కటాఫ్ నిర్మాణం, గేట్ గ్రూవ్స్లో చిప్పింగ్ పనులు, స్పిల్వేలో రెండో దశ కాంక్రీట్ పనుల నిర్వహణ పనులను అదనంగా చేపట్టవలసి వస్తోందని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.
ys jagan to bad news from central govt
ఇక పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే అని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. నిర్మాణ ప్రణాళికతోపాటు ప్రాజెక్ట్లోని వివిధ విభాగాలకు సంబంధించిన డిజైన్ల రూపకల్పన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానంతో ఏపీ సర్కార్ కు షాక్ తగిలినట్లైంది. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర పతనావస్థలో ఉన్న ప్రభుత్వానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టులో వ్యయం భరించాల్సి రావడం భారంగా మారనుంది.
bjp
నిధుల లేమితో ప్రాజెక్టు పనులు ఆపితే జనాల్లో తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. తాజా ప్రకటన నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అప్పుల కుప్పగా మారిన ఆంధ్రప్రదేశ్ .. పోలవరం అదనపు వ్యయంపై ఏం చేయనుందన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. దీన్నుంచి ఏవిధంగా బయటపడుతుందన్న చర్చ అటు పార్టీలోనూ, విపక్షాల్లోనూ అంతర్గతంగా సాగుతోంది. మరోవైపు దీనిపై తీసుకునే నిర్ణయాన్ని .. టీడీపీ ఆసక్తికరంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఖర్చుపై పయ్యావుల కేశవ్ .. చేస్తోన్న విమర్శలకు మరింత బలం పెరుగుతుందని, ఇది తమకు కలిసివచ్చే అంశమని టీడీపీ భావిస్తోంది.
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
This website uses cookies.