YS Sharmila : ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పుంజుకుంటోంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలుసు కదా. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం డీకే శివకుమార్. అందుకే.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే కీలక నిర్ణయాల్లో డీకే శివకుమార్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లోనూ ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు. సోనియా గాంధీ కూడా డీకే శివకుమార్ ను ప్రతి విషయంలో ఇన్వాల్వ్ చేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం శివకుమార్ తన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే పరిస్థితులు ఉన్నాయి. కర్ణాటక ఎఫెక్ట్ ఖచ్చితంగా తెలంగాణలో ఉండబోతోంది. అలాగే.. అధికార బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అందుకే.. తెలంగాణ మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. తమతో కలిసి వచ్చే వాళ్లను ప్రోత్సహిస్తోంది. పార్టీలోకి చేరికలు కూడా పెరుగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల సారథ్య బాధ్యతలను డీకే శివకుమార్ తీసుకోవడంతో ఇక తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చినట్టే అని భావించాలి.
అయితే.. వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం అవడం దాదాపు లాంఛనమే అని అనుకోవాలి. దానికి కారణం డీకే శివకుమార్. షర్మిల పార్టీని కాంగ్రెస్ లో కలపాలనే ప్రతిపాదన తీసుకొచ్చిందే ఆయన. ఎందుకంటే.. వైఎస్సార్ కూతురుగా షర్మిలతో డీకే శివకుమార్ కు సత్సంబంధాలే ఉన్నాయి. షర్మిల కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవగానే బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ ను కలిసి వచ్చారు. అప్పుడే డీకే కూడా షర్మిలకు మంచి ఆఫర్ ఇచ్చారట. కాంగ్రెస్ లో విలీనం చేయాలని కోరారట. డీకే చెప్పారు కాబట్టే షర్మిల కూడా ఈ విషయంపై పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది. డీకే నాయకత్వంలో తెలంగాణలోనే షర్మిలకు కీలక పదవి కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతా ఓకే అయితే.. ఇక షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవ్వడం పక్కా అని చెప్పుకోవచ్చు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.