ys vivekananda reddy daughter sunitha reddy met cbi officers in delhi
YS Viveka Murder Case : వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు రోజు రోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఆయన మర్డర్ కేసును సాల్వ్ చేయాలని వివేకా కూతురు సునీతా రెడ్డి చాలా రోజుల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ… ఆమెను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చివరకు తనకే బెదిరింపులు వస్తున్నాయని.. ఈ కేసును ఇక్కడితో వదిలేయాలంటూ తనను బెదిరిస్తున్నారంటూ సునీత సంచలన ఆరోపణలు చేశారు.
ys vivekananda reddy daughter sunitha reddy met cbi officers in delhi
ఆమె తాజాగా ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులను కలిశారు. ఆయన హత్య కేసును త్వరగా పరిష్కరించాలంటూ సీబీఐ ఉన్నతాధికారులను ఆమె కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సునిత.. సీబీఐ అధికారులు కూడా ఈ హత్య కేసును పట్టించుకోవడం లేదంటూ స్పష్టం చేశారు. కడపలో ఇటువంటి హత్యలు కామన్ అంటూ.. సీబీఐ అధికారులు వ్యాఖ్యానించారని ఆమె వాపోయారు.
వివేకా హత్య జరిగి రెండేళ్లు దాటినా… ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదని.. సాక్షులు కూడా చనిపోతున్నారని…. కేసును వదిలేసుకోవాలంటూ తననే బెదిరిస్తున్నారని ఆమె మీడియా ముందు తెలిపారు.ఇంకా ఎంతమందిపై ఇలా దాడులు చేస్తారు. వివేకానందరెడ్డి…. మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి బాబాయి.. అయినా కూడా తనకు న్యాయం చేయకుండా కడప ఇటువంటి హత్యలు కామన్ అంటూ సీబీఐ అధికారులు చెప్పడం ఏంటి? అంటూ సునీతా ప్రశ్నించారు.
నా ఈ పోరాటంలో నాకు షర్మిల మద్దతుగా నిలిచిందని సునీత స్పష్టం చేశారు. తప్పు జరిగిన విషయం షర్మిలకు కూడా తెలుసని ఆమె అన్నారు. విచారణను కావాలని సరిగ్గా చేయడం లేదు. ఇంకా ఎంత కాలం న్యాయం కోసం వేచి చూడాలి. న్యాయం ఆలస్యం అవుతోందంటే….. అన్యాయం చేసినట్టే లెక్క. వివేకానందరెడ్డికి శత్రువులు ఎవరూ లేరు. రాజకీయ కారణాలతోనే ఈ హత్య జరిగి ఉంటుంది. న్యాయం జరిగే వరకు నేను పోరాడుతూనే ఉంటా.. అని సునీత స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.