YS Viveka Murder Case : వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు రోజు రోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఆయన మర్డర్ కేసును సాల్వ్ చేయాలని వివేకా కూతురు సునీతా రెడ్డి చాలా రోజుల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ… ఆమెను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చివరకు తనకే బెదిరింపులు వస్తున్నాయని.. ఈ కేసును ఇక్కడితో వదిలేయాలంటూ తనను బెదిరిస్తున్నారంటూ సునీత సంచలన ఆరోపణలు చేశారు.
ఆమె తాజాగా ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులను కలిశారు. ఆయన హత్య కేసును త్వరగా పరిష్కరించాలంటూ సీబీఐ ఉన్నతాధికారులను ఆమె కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సునిత.. సీబీఐ అధికారులు కూడా ఈ హత్య కేసును పట్టించుకోవడం లేదంటూ స్పష్టం చేశారు. కడపలో ఇటువంటి హత్యలు కామన్ అంటూ.. సీబీఐ అధికారులు వ్యాఖ్యానించారని ఆమె వాపోయారు.
వివేకా హత్య జరిగి రెండేళ్లు దాటినా… ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదని.. సాక్షులు కూడా చనిపోతున్నారని…. కేసును వదిలేసుకోవాలంటూ తననే బెదిరిస్తున్నారని ఆమె మీడియా ముందు తెలిపారు.ఇంకా ఎంతమందిపై ఇలా దాడులు చేస్తారు. వివేకానందరెడ్డి…. మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి బాబాయి.. అయినా కూడా తనకు న్యాయం చేయకుండా కడప ఇటువంటి హత్యలు కామన్ అంటూ సీబీఐ అధికారులు చెప్పడం ఏంటి? అంటూ సునీతా ప్రశ్నించారు.
నా ఈ పోరాటంలో నాకు షర్మిల మద్దతుగా నిలిచిందని సునీత స్పష్టం చేశారు. తప్పు జరిగిన విషయం షర్మిలకు కూడా తెలుసని ఆమె అన్నారు. విచారణను కావాలని సరిగ్గా చేయడం లేదు. ఇంకా ఎంత కాలం న్యాయం కోసం వేచి చూడాలి. న్యాయం ఆలస్యం అవుతోందంటే….. అన్యాయం చేసినట్టే లెక్క. వివేకానందరెడ్డికి శత్రువులు ఎవరూ లేరు. రాజకీయ కారణాలతోనే ఈ హత్య జరిగి ఉంటుంది. న్యాయం జరిగే వరకు నేను పోరాడుతూనే ఉంటా.. అని సునీత స్పష్టం చేశారు.
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
This website uses cookies.