ys vivekananda reddy : ఆంధ్రప్రదేశ్ లో ఒక హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సైతం ఏడాది కాలంగా కొలిక్కి తీసుకురాకపోవటం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందునా నాటి ప్రతిపక్ష నేత, నేటి ప్రభుత్వాధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరో మర్డర్ చేస్తే వాళ్లను ఇప్పటికీ దొరకబుచ్చుకోలేకపోవటం విస్మయం కలిగిస్తోంది. ఆ కేసే అంత కాంప్లికేటెడ్ గా ఉందా లేక దర్యాప్తు సంస్థ ఉదాసీనత ప్రదర్శిస్తోందా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. హత్య జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ, హత్య జరిగిన తర్వాత వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నా ఈ కేసులో ఇప్పటివరకూ ఒక్క కీలకమైన వ్యక్తిని గానీ, క్లూ పాయింట్ ని గానీ కనుక్కోలేకపోవటంతో నిజంగా దర్యాప్తు సంస్థల సామర్థ్యాన్ని సందేహించాల్సి వస్తోంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన రోజు ఆయన ఇంటి వద్ద అనుమానాస్పద రీతిలో కొన్ని వాహనాలు తిరిగాయని అంటున్నారు. దీంతో ఒక ఇన్నోవా కారు ఓనర్ తోపాటు డ్రైవర్ పైన కూడా సీబీఐ విచారణ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ కారులో ఎవరెవరు వచ్చారు? ఏం మేం చేశారు? అనే విషయాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. వాటిపైనే సీబీఐ ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే కొంత మంది అనుమానితులను అరెస్ట్ చేయగా వాళ్లు చెబుతున్న అంశాల ఆధారంగానే దర్యాప్తు కొనసాగుతోంది. దీన్నిబట్టి నిందితులు త్వరలో దొరికే ఛాన్స్ ఉందని భావించొచ్చు.
వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు సీబీఐకే సవాల్ గా నిలుస్తోంది. అందుకే ఏడాది నుంచి విచారణ చేస్తున్నా పురోగతి కనిపించట్లేదు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. వైఎస్ కుటుంబం ఆదినారాయణరెడ్డి అనే నాయకుడిపై అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆదినారాయణరెడ్డి మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. తాను దోషిగా తేలితే ఏ శిక్షకైనా రెడీ అని ఛాలెంజ్ చేస్తున్నారు. వైఎస్ జగనేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కోరి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఎలాగూ ఆయన కోరినట్లు సీబీఐ దర్యాప్తు చేస్తోంది కాబట్టి తాను మాట్లాడటానికేముంది అనేది సీఎం వైఎస్ జగన్ అభిప్రాయంలా కనిపిస్తోంది. మధ్యలో వైఎస్ వివేకానందరెడ్డి బిడ్డ ఢిల్లీలోని సీబీఐ ఆఫీసుకు వెళ్లి తన తండ్రి హత్య కేసు దర్యాప్తు ఏమైందని నిలదీయటంతో ఈ మాత్రమైనా కదలిక వచ్చింది.
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
This website uses cookies.