ys vivekanandareddy murder case progress
ys vivekananda reddy : ఆంధ్రప్రదేశ్ లో ఒక హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సైతం ఏడాది కాలంగా కొలిక్కి తీసుకురాకపోవటం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందునా నాటి ప్రతిపక్ష నేత, నేటి ప్రభుత్వాధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరో మర్డర్ చేస్తే వాళ్లను ఇప్పటికీ దొరకబుచ్చుకోలేకపోవటం విస్మయం కలిగిస్తోంది. ఆ కేసే అంత కాంప్లికేటెడ్ గా ఉందా లేక దర్యాప్తు సంస్థ ఉదాసీనత ప్రదర్శిస్తోందా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. హత్య జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ, హత్య జరిగిన తర్వాత వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నా ఈ కేసులో ఇప్పటివరకూ ఒక్క కీలకమైన వ్యక్తిని గానీ, క్లూ పాయింట్ ని గానీ కనుక్కోలేకపోవటంతో నిజంగా దర్యాప్తు సంస్థల సామర్థ్యాన్ని సందేహించాల్సి వస్తోంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన రోజు ఆయన ఇంటి వద్ద అనుమానాస్పద రీతిలో కొన్ని వాహనాలు తిరిగాయని అంటున్నారు. దీంతో ఒక ఇన్నోవా కారు ఓనర్ తోపాటు డ్రైవర్ పైన కూడా సీబీఐ విచారణ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ కారులో ఎవరెవరు వచ్చారు? ఏం మేం చేశారు? అనే విషయాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. వాటిపైనే సీబీఐ ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే కొంత మంది అనుమానితులను అరెస్ట్ చేయగా వాళ్లు చెబుతున్న అంశాల ఆధారంగానే దర్యాప్తు కొనసాగుతోంది. దీన్నిబట్టి నిందితులు త్వరలో దొరికే ఛాన్స్ ఉందని భావించొచ్చు.
ys vivekanandareddy murder case progress
వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు సీబీఐకే సవాల్ గా నిలుస్తోంది. అందుకే ఏడాది నుంచి విచారణ చేస్తున్నా పురోగతి కనిపించట్లేదు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. వైఎస్ కుటుంబం ఆదినారాయణరెడ్డి అనే నాయకుడిపై అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆదినారాయణరెడ్డి మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. తాను దోషిగా తేలితే ఏ శిక్షకైనా రెడీ అని ఛాలెంజ్ చేస్తున్నారు. వైఎస్ జగనేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కోరి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఎలాగూ ఆయన కోరినట్లు సీబీఐ దర్యాప్తు చేస్తోంది కాబట్టి తాను మాట్లాడటానికేముంది అనేది సీఎం వైఎస్ జగన్ అభిప్రాయంలా కనిపిస్తోంది. మధ్యలో వైఎస్ వివేకానందరెడ్డి బిడ్డ ఢిల్లీలోని సీబీఐ ఆఫీసుకు వెళ్లి తన తండ్రి హత్య కేసు దర్యాప్తు ఏమైందని నిలదీయటంతో ఈ మాత్రమైనా కదలిక వచ్చింది.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.