YSRCP : ఆ నేతలు ఎందుకు వైఎస్ జగన్ పై అంత సీరియస్ గా ఉన్నారు? జగన్ చేస్తున్న తప్పేంటి?
YSRCP మంత్రులతో భేటీలు ఎంఎల్ఏలతో సమావేశాలు ఎంపిలతో ముఖాముఖీలు కాదు తమతో భేటీ కావాలని కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నారు. తమతో భేటీ అయితే మాత్రమే గ్రౌండ్ లెవల్ లో పరిస్థితులు ఏమిటో వైఎస్ జగన్ కు తెలుస్తాయని పార్టీ ద్వితీయశ్రేణి నేతలు కార్యకర్తలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలపై ప్రజల అభిప్రాయాలు వైఎస్ జగన్ కు తెలియాలంటే తమతో భేటీ అయితే మాత్రమే సాధ్యమవుతుందని కార్యకర్తలు చాలా గట్టిగా కోరుకుంటున్నారు.
ముఖాముఖి భేటీల విషయంలో కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతల వాదనలో డిమాండ్ లో చాలా వాస్తవముంది. ముఖ్యమంత్రిగా ఎవరున్నా మంత్రులు ఎంపీలు ఎంఎల్ఏలు క్షేత్రస్ధాయిలోని వాస్తవాలను పూర్తిగా చెప్పలేరన్నది వాస్తవం. ఈ విషయం చంద్రబాబునాయుడు అయినా వైఎస్ జగన్ విషయంలో అయినా జరిగేది ఇదే. ఐదేళ్ళ చంద్రబాబు హయాంలో మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు చేసిందిదే. ప్రజాప్రతినిధులకు అదనంగా ఉన్నతాధికారులు కన్సల్టెంట్లు సలహాదారులు చంద్రబాబును పూర్తిగా తప్పుదోవ పట్టించారు. దాని ఫలితమే మొన్నటి ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఘోరమైన ఓటమి. అప్పుడు కూడా టీడీపీలోని ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలు కూడా చంద్రబాబును ఇలాంటి భేటీలే పదే పదే కోరుకున్నా సాధ్యం కాలేదు.
Chandrababu Naidu : మత విద్వేషాలు రెచ్చగొడితే తాట తీస్తాం అంటూ చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్..!
Ys Jagan : జగన్ను వీడిన మాజీ మంత్రుల పరిస్థితి ‘అడకత్తెరలో పోకచెక్క’.. కూటమిలో దక్కని గుర్తింపు.. ఇక సొంతగూటికేనా?
YS jagan : జగన్ ‘ప్లాన్ బి’ సిద్ధం.. ధర్మాన ఒత్తిడికి చెక్ పెట్టేలా శ్రీకాకుళంలో కొత్త నాయకత్వ సమీకరణాలు!

