Amit Shah : ఏపీలో అమిత్ షా బిజీ షెడ్యూల్.. చంద్రబాబు, పవన్ల దగ్గర వైఎస్ ప్రస్థావన తెచ్చిన కేంద్ర హోంమంత్రి
Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా Amit Shah పర్యటన ఏపీలో బిజీ బిజీగా నడుస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు Chandra Babu Naidu శనివారం రాత్రి తన నివానంలో విందు ఏర్పాటు చేశారు. ఏసీ సీఎం ఇచ్చిన విందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ Bandi Sanjay, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Pawan Kalyan , లోకేశ్ Nara Lokesh సహా మంత్రులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు. . విశాఖ ఉక్కుకు కేంద్రం బారీ ప్యాకేజీ ప్రకటించిన మరునాడే అమిత్ షా ఏపికి రావడంతో అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఇటు రాష్ట్ర ప్రజలు కూడా షా టూర్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే విశాఖ ఉక్కు తెలుగు ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశమని తమకు తెలుసున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకునే ప్యాకేజీని ప్రకటించామని అన్నారు…
Amit Shah : ఏపీలో అమిత్ షా బిజీ షెడ్యూల్.. చంద్రబాబు, పవన్ల దగ్గర వైఎస్ ప్రస్థావన తెచ్చిన కేంద్ర హోంమంత్రి
ఎన్టీఆర్కు Sr Ntr భారతరత్న ఇవ్వాలని కోరిన చంద్రబాబు Chandrababu .. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు Congress వ్యతిరేకంగా భావసారూప్యత గల పార్టీలను ఆయన ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్టీఆర్ SR NTR కు భారతరత్న కోరుతూ కేంద్రానికి వినతిపత్రం అందజేశామని ఎంపీ పురందేశ్వరి గుర్తుచేశారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. ఎన్టీఆర్ గొప్ప నేతని, భారతరత్నకు ఆయన అన్నివిధాలా అర్హులని వ్యాఖ్యానించారు. కాగా, విందులో పలు అంశాలపై ఆసక్తికర చర్చ జరిగింది. అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల గురించి కూడా కేంద్ర హోం మంత్రి ఆరా తీశారు. భూముల ధరల గురించి ప్రస్తావన రాగా..‘ ఒకప్పుడు ఆంధ్రా ప్రాంతంలో ఎకరం అమ్మితే హైదరాబాద్లో ఐదు ఎకరాలు వచ్చేది… ఇప్పుడు అక్కడ ఒక ఎకరం అమ్మితే.. ఇక్కడ యాభై ఎకరాలు కొనొచ్చు’ అని చంద్రబాబు చెప్పారు.
నాడు కాంగ్రెస్ పార్టీ నిత్యం సీఎంలను మారుస్తూ సాగిన వైనాన్ని ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక కాలం సీఎంగా పనిచేసింది ఎవరు? అంటూ షా ఆరా తీశారు. దీంతో ఏమాత్రం తడుముకోని చంద్రబాబు… దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డేనని తెలిపారు. వైఎస్ Ys Rajashekar reddy ఏకంగా ఆరేళ్లపాటు సీఎంగా పనిచేశారని చంద్రబాబు గుర్తు చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి కూడా ఒకింత ఎక్కువ కాలమే సీఎంగా పనిచేశారని తెలిపారు. ఈ భేటిలో వైఎస్ ప్రస్తావన రావడం చర్చనీయాంశంగా మారింది. విందు భేటీలో అమిత్షా జగన్ ప్యాలెస్ల గురించి అడిగి మరీ తెలుసుకున్నట్లు సమాచారం. ఇడుపులపాయ, బెంగళూరు ఎలహంక, హైదరాబాద్ లోటస్పాండ్, తాడేపల్లిలో ప్యాలెస్లు ఉన్నాయని లోకేశ్ అమిత్షాకు వివరించారు. ఒక్కొక్కటి ఎన్ని ఎకరాలు ఉండొచ్చని అడగ్గా హైదరాబాద్, తాడేపల్లి ప్యాలెస్లో పది ఎకరాల్లోపు ఉంటాయని లోకేశ్ Nara Lokesh బదులిచ్చారు
AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్…
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్శాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
This website uses cookies.