Amit Shah : ఏపీలో అమిత్ షా బిజీ షెడ్యూల్.. చంద్రబాబు, పవన్ల దగ్గర వైఎస్ ప్రస్థావన తెచ్చిన కేంద్ర హోంమంత్రి
Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా Amit Shah పర్యటన ఏపీలో బిజీ బిజీగా నడుస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు Chandra Babu Naidu శనివారం రాత్రి తన నివానంలో విందు ఏర్పాటు చేశారు. ఏసీ సీఎం ఇచ్చిన విందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ Bandi Sanjay, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Pawan Kalyan , లోకేశ్ Nara Lokesh సహా మంత్రులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు. . విశాఖ ఉక్కుకు కేంద్రం బారీ ప్యాకేజీ ప్రకటించిన మరునాడే అమిత్ షా ఏపికి రావడంతో అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఇటు రాష్ట్ర ప్రజలు కూడా షా టూర్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే విశాఖ ఉక్కు తెలుగు ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశమని తమకు తెలుసున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకునే ప్యాకేజీని ప్రకటించామని అన్నారు…
Amit Shah : ఏపీలో అమిత్ షా బిజీ షెడ్యూల్.. చంద్రబాబు, పవన్ల దగ్గర వైఎస్ ప్రస్థావన తెచ్చిన కేంద్ర హోంమంత్రి
ఎన్టీఆర్కు Sr Ntr భారతరత్న ఇవ్వాలని కోరిన చంద్రబాబు Chandrababu .. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు Congress వ్యతిరేకంగా భావసారూప్యత గల పార్టీలను ఆయన ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్టీఆర్ SR NTR కు భారతరత్న కోరుతూ కేంద్రానికి వినతిపత్రం అందజేశామని ఎంపీ పురందేశ్వరి గుర్తుచేశారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. ఎన్టీఆర్ గొప్ప నేతని, భారతరత్నకు ఆయన అన్నివిధాలా అర్హులని వ్యాఖ్యానించారు. కాగా, విందులో పలు అంశాలపై ఆసక్తికర చర్చ జరిగింది. అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల గురించి కూడా కేంద్ర హోం మంత్రి ఆరా తీశారు. భూముల ధరల గురించి ప్రస్తావన రాగా..‘ ఒకప్పుడు ఆంధ్రా ప్రాంతంలో ఎకరం అమ్మితే హైదరాబాద్లో ఐదు ఎకరాలు వచ్చేది… ఇప్పుడు అక్కడ ఒక ఎకరం అమ్మితే.. ఇక్కడ యాభై ఎకరాలు కొనొచ్చు’ అని చంద్రబాబు చెప్పారు.
నాడు కాంగ్రెస్ పార్టీ నిత్యం సీఎంలను మారుస్తూ సాగిన వైనాన్ని ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక కాలం సీఎంగా పనిచేసింది ఎవరు? అంటూ షా ఆరా తీశారు. దీంతో ఏమాత్రం తడుముకోని చంద్రబాబు… దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డేనని తెలిపారు. వైఎస్ Ys Rajashekar reddy ఏకంగా ఆరేళ్లపాటు సీఎంగా పనిచేశారని చంద్రబాబు గుర్తు చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి కూడా ఒకింత ఎక్కువ కాలమే సీఎంగా పనిచేశారని తెలిపారు. ఈ భేటిలో వైఎస్ ప్రస్తావన రావడం చర్చనీయాంశంగా మారింది. విందు భేటీలో అమిత్షా జగన్ ప్యాలెస్ల గురించి అడిగి మరీ తెలుసుకున్నట్లు సమాచారం. ఇడుపులపాయ, బెంగళూరు ఎలహంక, హైదరాబాద్ లోటస్పాండ్, తాడేపల్లిలో ప్యాలెస్లు ఉన్నాయని లోకేశ్ అమిత్షాకు వివరించారు. ఒక్కొక్కటి ఎన్ని ఎకరాలు ఉండొచ్చని అడగ్గా హైదరాబాద్, తాడేపల్లి ప్యాలెస్లో పది ఎకరాల్లోపు ఉంటాయని లోకేశ్ Nara Lokesh బదులిచ్చారు
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
This website uses cookies.