
Chandrababu : నూతన సంవత్సరంలో చంద్రబాబు తీపి కబురు...!
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడు నెలల పాలన పూర్తి చేసుకోగా, వారు ఇచ్చిన ఎన్నికల హామీలని ఒక్కొక్కటిగా తీర్చే పనిలో పడ్డారు. వైసీపీ హయాంలో మాదిరిగా కాకుండా మద్యం దుకాణాలలో నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. రోడ్లపై ఫోకస్ చేసిన కూటమి ప్రభుత్వం మరోవైపు ఏపీ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సైతం ఉక్కుపాదం మోపుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశం కన్పిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయనేది ఉద్యోగుల ఆశగా ఉంది.
Chandrababu : నూతన సంవత్సరంలో చంద్రబాబు తీపి కబురు…!
అందుకు తగ్గట్టే ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేయవచ్చని సమాచారం. ఉద్యోగులకు సంక్రాంతి పురస్కరించుకుని భారీ నజరానా ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. సంక్రాంతి పురస్కరించుకుని భారీ నజరానా ప్రకటించనున్నారు. సంక్రాంతికి ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. 11 గంటలకు జరగనున్న ఏపీ కేబినెట్ భేటీలో ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. వెలగపూడిలోని సచివాలయం 1వ బ్లాక్ లో మంత్రిమండలి సమావేశముంది. ఈ భేటీలో రెండు డీఏలు ప్రకటించవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలతో పాటు పీఆర్సీ, ఐఆర్పై కూడా చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు.
నెలకు రెండుసార్లు ఏపీ కేబినెట్ సమావేశం కావాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆ మేరకు ఈ నెలలో మొదటి కేబినెట్ భేటీ జరగనుంది. సంక్రాంతి కానుకగా రెండు డీఏలు ప్రకటించవచ్చు. వెలగపూడిలోని సచివాలయం 1వ బ్లాక్ లో గురువారం నాడు ఏపీ మంత్రివర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ రోజు టీడీపీ కార్యకర్తలు, నాయకులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశవ్యాప్తంగా సంతాప దినాలు కొనసాగుతున్నందున న్యూ ఇయర్ శుభాకాంక్షల కోసం తన వద్దకు బొకేలు, శాలువాలు తేవద్దని ఆయన సూచించారు. కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు కూడా వద్దని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.
PAK vs USA: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో…
Congress Party : మున్సిపల్ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి…
Ram Charan Upasana twins : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ mega power star Ram Charan …
Ys Jagan : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా…
Xiaomi 17T Pro : కొత్త స్మార్ట్ఫోన్ కొనాలని అనుకుంటున్న వారికి ఇది నిజంగా సూపర్ న్యూస్. ప్రముఖ మొబైల్…
AI : నేటి ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం పెరగడంతో చాలామంది తమ ఉద్యోగాల భవిష్యత్తు గురించి…
Vivo T3 FE 5G review : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో (Vivo) భారత మార్కెట్లో మరో విప్లవాత్మక…
This website uses cookies.