
Telangana Students : తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పనున్న సీఎం రేవంత్ రెడ్డి.. తర్వలో మరో పథకం అమలు..?
Telangana Students : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ఒక్కొక్క అడుగు పడుతుండడంతో ఎలక్ట్రానిక్ స్కూటీల పథకం కూడా అమలు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ పథకాన్ని అమలు చేసి యువ ఓటర్లను ఆకర్షించే వ్యూహంతో కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. రెగ్యులర్ గా కాలేజీలకు వెళ్లే వారికి మాత్రమే పథకం వర్తించేలా కార్యాచరణకు రంగం సిద్ధమవుతుంది. విద్యార్థిని కుటుంబం బిపిఎల్ గా గుర్తింపునకు కుటుంబ రేషన్ కార్డు పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పేద విద్యార్థినిలు ఐదు లక్షల మంది వరకు ఉండగా వీరిలో రెండు లక్షల మంది మహానగర పరిధిలో ఉన్నట్లు ప్రాథమిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న వారు 70 వేల మంది వరకు ఉండవచ్చని అంచనా. తొలి విడతలో ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న విద్యార్థినీలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేలా నిబంధనల రూపకల్పన జరుగుతున్నట్లు సమాచారం.
ఎలక్ట్రానిక్ స్కూటీల పథకం పెద్ద ఖర్చుతో కూడుకున్నదే. ఎలక్ట్రిక్ స్కూటీ సామర్థ్యం 40 వేల నుంచి 1.5 లక్షలకు పైగా ధర ఉంటుంది. ఫ్యాక్టరీ నుంచి రాయితీ రావడంతో కనీసం ఒక్క స్కూటీ కి సగటున 50 వేల చొప్పున ధర లెక్కిస్తే సుమారు 350 కోట్ల ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్కూటీలకు డ్రైవింగ్ లైసెన్స్ లు తప్పనిసరి. లైసెన్స్ తీయడం విద్యార్థినీలకు కత్తి మీద సామే. చాలామందికి వాహనం నడపటం వచ్చినప్పటికీ డ్రైవింగ్ లైసెన్స్ లేవు. వారికి రహదారి భద్రత గురించి అవగాహన తక్కువగా ఉండడం రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్సూరెన్స్ వర్తించే అవకాశం సైతం ఉండదు. ప్రభుత్వ విద్యార్థినిలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థినీలకు ఈ పథకం అందకపోవచ్చు.
కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఎలక్ట్రానిక్ స్కూటీ పథకం ప్రకటించడంతో కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న విద్యార్థినీలలో ఆశలు రేకేత్తిస్తున్నాయి. ఉచిత ఎలక్ట్రానిక్ విద్యార్థినీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పేద విద్యార్థులకు రోజువారి రవాణా ఖర్చులు ఇబ్బందులు తగ్గుతాయి. పెట్రోల్ ఖర్చులు ఉండనందున ఇంటి అవసరాలకు సైతం బైక్ను వాడుకోవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ స్కూటీ ల వలన విద్యార్థినులకు సమయం ఆదా అవుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా అనుకున్న గమ్యానికి త్వరగా చేరుకుంటారు. అంతేకాకుండా అమ్మాయిలకు స్కూటీ రక్షణగా ఉంటుంది. ఏ సమయంలోనైనా బయటికి వెళ్లి రావచ్చు. ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేసి కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలని విద్యార్థినులు కోరుకుంటున్నారు.
Ration Card : దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)ను మరింత…
Pooris : భారతీయుల అల్పాహారాల్లో పూరీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆలుగడ్డ కూరతో వేడి వేడి పూరీలు తింటే వచ్చే…
Habits : ప్రస్తుతం వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఉద్యోగ ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు…
Tea : భారతీయుల దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీతో రోజు…
Peddi Pre-Release Event : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం…
Ponnam Prabhakar : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత Pawan Kalyan హైదరాబాద్లో…
CM Vijay BJP : తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ హాట్ టాపిక్గా మారింది. నటుడు నుంచి…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు…
Peddi Movie First Review : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana…
Vaibhav Sooryavanshi : IPL 2026 సీజన్లో భారత క్రికెట్కు మరో కొత్త సూపర్ స్టార్ దొరికాడు. కేవలం 15…
Peddi Pre-Release Event : టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రాల్లో ‘పెద్ది’ ఒకటి. మెగా పవర్ స్టార్…
Bank Holidays in June 2026 : జూన్ నెలలో బ్యాంకులకు సంబంధించిన పనులు ఉన్నవారు ముందుగానే అప్రమత్తంగా ఉండాల్సిన…
This website uses cookies.