
Telangana Students : తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పనున్న సీఎం రేవంత్ రెడ్డి.. తర్వలో మరో పథకం అమలు..?
Telangana Students : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ఒక్కొక్క అడుగు పడుతుండడంతో ఎలక్ట్రానిక్ స్కూటీల పథకం కూడా అమలు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ పథకాన్ని అమలు చేసి యువ ఓటర్లను ఆకర్షించే వ్యూహంతో కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. రెగ్యులర్ గా కాలేజీలకు వెళ్లే వారికి మాత్రమే పథకం వర్తించేలా కార్యాచరణకు రంగం సిద్ధమవుతుంది. విద్యార్థిని కుటుంబం బిపిఎల్ గా గుర్తింపునకు కుటుంబ రేషన్ కార్డు పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పేద విద్యార్థినిలు ఐదు లక్షల మంది వరకు ఉండగా వీరిలో రెండు లక్షల మంది మహానగర పరిధిలో ఉన్నట్లు ప్రాథమిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న వారు 70 వేల మంది వరకు ఉండవచ్చని అంచనా. తొలి విడతలో ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న విద్యార్థినీలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేలా నిబంధనల రూపకల్పన జరుగుతున్నట్లు సమాచారం.
ఎలక్ట్రానిక్ స్కూటీల పథకం పెద్ద ఖర్చుతో కూడుకున్నదే. ఎలక్ట్రిక్ స్కూటీ సామర్థ్యం 40 వేల నుంచి 1.5 లక్షలకు పైగా ధర ఉంటుంది. ఫ్యాక్టరీ నుంచి రాయితీ రావడంతో కనీసం ఒక్క స్కూటీ కి సగటున 50 వేల చొప్పున ధర లెక్కిస్తే సుమారు 350 కోట్ల ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్కూటీలకు డ్రైవింగ్ లైసెన్స్ లు తప్పనిసరి. లైసెన్స్ తీయడం విద్యార్థినీలకు కత్తి మీద సామే. చాలామందికి వాహనం నడపటం వచ్చినప్పటికీ డ్రైవింగ్ లైసెన్స్ లేవు. వారికి రహదారి భద్రత గురించి అవగాహన తక్కువగా ఉండడం రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్సూరెన్స్ వర్తించే అవకాశం సైతం ఉండదు. ప్రభుత్వ విద్యార్థినిలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థినీలకు ఈ పథకం అందకపోవచ్చు.
కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఎలక్ట్రానిక్ స్కూటీ పథకం ప్రకటించడంతో కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న విద్యార్థినీలలో ఆశలు రేకేత్తిస్తున్నాయి. ఉచిత ఎలక్ట్రానిక్ విద్యార్థినీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పేద విద్యార్థులకు రోజువారి రవాణా ఖర్చులు ఇబ్బందులు తగ్గుతాయి. పెట్రోల్ ఖర్చులు ఉండనందున ఇంటి అవసరాలకు సైతం బైక్ను వాడుకోవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ స్కూటీ ల వలన విద్యార్థినులకు సమయం ఆదా అవుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా అనుకున్న గమ్యానికి త్వరగా చేరుకుంటారు. అంతేకాకుండా అమ్మాయిలకు స్కూటీ రక్షణగా ఉంటుంది. ఏ సమయంలోనైనా బయటికి వెళ్లి రావచ్చు. ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేసి కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలని విద్యార్థినులు కోరుకుంటున్నారు.
Iran Usa : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఒక షాకింగ్ నివేదిక బయటకు వచ్చింది. ఇరాన్ మరియు…
Vijay Sai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు అత్యంత కీలక పాత్ర పోషించిన విజయసాయి రెడ్డి రాజకీయ…
Tax Rules Gold : భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు అది ఒక భావోద్వేగం…
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. అదే మంత్రివర్గ విస్తరణ. ముఖ్యంగా…
TRS : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పాత జెండా పేరు చుట్టూ వేడి చర్చలు మొదలయ్యాయి. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను…
Ajay Ghosh : టాలీవుడ్లో మరోసారి రెమ్యూనరేషన్ అంశం హాట్ టాపిక్గా మారింది. ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ఇటీవల…
Cold Water : వేసవి కాలం మొదలయ్యిందంటే చాలు, చల్లటి నీటి కోసం ప్రతి ఇంటిలో ఫ్రిజ్ తలుపులు ఎక్కువసార్లు…
Paapam Prathap Movie Review in Telugu : టాలీవుడ్లో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన…
Bad Boy Karthik Movie Review in Telugu : టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య Naga Shaurya తన…
Green Tea vs Black Coffee : నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యం, ఫిట్నెస్పై అవగాహన గణనీయంగా పెరిగింది. బరువు…
Modi : దేశ రాజకీయాల్లో ఇప్పుడు నారీ శక్తి వందన చట్టం సవరణ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు విశ్లేషిస్తే వైసీపీ అధినేత జగన్…
This website uses cookies.