Congress : మొదటికే కాంగ్రెస్ పరిస్థితి.. ఓటమికి గల కారణాలని అన్వేషించే పనిలో రాహుల్
Congress : ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉండి ఓ ఊపు ఊపేసింది. కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మహారాష్ట్రలో ఘోర పరాజయం.. హరియాణాలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు ఖాయమని సర్వేలు ఘంటా పథంగా ప్రకటించిన చోటా.. కుప్పకూలడం.. ఇక, జమ్ము కశ్మీర్లో మేలిమి ఓటు బ్యాంకు కునారిల్లడం.. ఇవీ.. గత ఆరు మాసాల్లో అతి పురాతన కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న అతి పెద్ద అపజయాలు, పరాభవాలు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడటంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. అసలు ఓటమికి కారణాలు ఏంటి అనేది తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది.
Congress : మొదటికే కాంగ్రెస్ పరిస్థితి.. ఓటమికి గల కారణాలని అన్వేషించే పనిలో రాహుల్
ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమికి.. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ లోపించడమేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, హర్యానా ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుని.. వచ్చే ఎన్నికల్లో విజయాలు సాధించాలంటే.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భేటీ అయిన సీడబ్ల్యూసీ కొన్ని తీర్మానాలు చేసింది. చేతులు కాలే వరకువెయిట్ చేసి.. ఆ తర్వాత ఆకులు పట్టుకునే తరహాలో కాంగ్రెస్ పార్టీ వడివడిగా విజృంభిస్తోంది. మరో రెండు మాసాల్లో కీలకమైన ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా మరో ఏడాదిలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. అయినా.. పార్టీలో వ్యవస్థీకృత మార్పుల దిశగా అడుగులు పడడం లేదు.
కాంగ్రెస్ లో క్రమ శిక్షణ సన్నగిల్లడం, నాయకులలో నిబద్ధత లేకుండా పోవడం, వ్యక్తిగత అజెండాలు పెరిగిపోవడం, అంతర్గత కుమ్ములాటలు , నాయకులు యాంత్రీకరణ కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణాలు అని ఖర్గే చెప్పుకొచ్చారు. ఇవే కాంగ్రెస్ పార్టీ కొంపముంచాయని, మున్ముందు ఇండియా కూటమిపైనా ప్రభావం చూపుతాయని అన్నారు. ఎన్నికలకు ముందు పార్టీలు మారుతున్న నాయకులను కట్టడి చేయడంలో విఫలమవుతున్నారని, ప్రజల నాడిని పట్టుకోలేక పోతున్నారని చెప్పినా.. ఖర్గే నుంచిరాహుల్ వరకు అంతా మాకు తెలుసు! అన్నట్టే వ్యవహరించారు. ఇప్పుడు వెనుదిరిగి చూసుకున్నా.. అవే విషయాలు కనిపిస్తున్నాయి. “మనం కఠినమైన క్రమశిక్షణను పాటించడం ముఖ్యం. ప్రతి సందర్భంలోనూ ఐక్యంగా ఉండాలి. పార్టీకి క్రమశిక్షణ అనేది ఆయుధం. కలసికట్టుగా ఉంటేనే గెలుస్తాం. విడిపోతే పడిపోతాం. పార్టీ బలంగానే ఉంటేనే మనం బలంగా ఉంటాం అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అని ఖర్చే అన్నారు.
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…
Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. ఎంతో కష్టపడి, కన్న…
Samantha Sreeleela : అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…
Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…
This website uses cookies.