Nara Bhuvaneswari : ఏపీ అసెంబ్లీలో ఇప్పటి వరకు చాలాసార్లు చంద్రబాబు ఫ్యామిలీపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. లోకేష్ ఎలా పుట్టాడు అంటూ కొందరు సభ్యులు చాలా అసభ్యంగానూ ప్రవర్తించారు. అప్పట్లో ఈ ఘటన తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయింది. అప్పుడు చంద్రబాబు ఫ్యామిలీ పరువును ఏపీ అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేతలు తీశారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ఫ్యామిలీనే రోడ్డు మీదికి వచ్చేలా చేశారు. చంద్రబాబు అరెస్ట్ తో ఆయన భార్య భువనేశ్వరి రోడ్డు మీదికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. నారా బ్రాహ్మణి కూడా తన అత్త భువనేశ్వరితో కలిసి చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నాకు జరిగింది నేను ఎప్పుడూ మరిచిపోను. ఏంటి నా మీద చూపిస్తారు. నేను అట్లాంటిదాన్ని.. ఇట్లాంటిదాన్ని అని. నేను ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నాకు మనస్సాక్షి ఉంటుంది. అది మా ఆయన నమ్మితే చాలు. వేరే వాళ్లు ఎంత వాగినా కూడా అది మనకు అనవసరం. ఇక్కడుండే స్త్రీలకు కూడా ఆ సందేశం ఇవ్వాలనుకుంటున్నాను.
మగాడు ఏదైనా మాట్లాడుతాడు. పని లేని వాళ్లు ఏదైనా మాట్లాడుతారు. వాళ్లు మరిచిపోతున్నారు. ఒక ఆడది తల్లి, భార్య అని. ఒక సృష్టికి మూలకర్త ఆడది అని వాళ్లు మరిచిపోయారు. అలాగే నేను మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను. అన్ని రకాల, వర్గాల నుంచి వచ్చి మీరు చంద్రబాబు గారికి మీరు ఇచ్చిన బలం కుటుంబంలా కూడా మరిచిపోలేం. మీరందరూ శాంతియుతంగా ఉండాలి. మనమంతా కలిసి పోరాడుదాం. యువగళం యాత్ర జనరేషన్ యూత్ కోసం. వాళ్లకు ముందు ఎట్లా చేస్తే బాగుంటుందని పాదయాత్ర స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందండి.. ఆయన యువగళం చేసే వాహనాన్ని కూడా ఎత్తుకెళ్లిపోయారు. అయినా కూడా తన పాదయాత్రను కొనసాగించారు. ఎంత ఆపినా ఏది ఆగదు. మనమందరం ముందుకెళ్తాం. చేయి చేయి కలిపి చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వాలి అని భువనేశ్వరి అన్నారు.
తోట సీతామహలక్ష్మీ గారు ఆసుపత్రిలో ఉంటే ఆమె మీద అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు పెట్టారు. ఆమెకు 70 ఏళ్లు. ఆమె ఈ వయసులో హత్య చేస్తుందా? ఒక్కరిని కాదు.. చంద్రబాబు గారి నియోజకవర్గం కుప్పంలో మహిళలు నిరసన చెబుతుంటే అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. క్యాండిల్ ర్యాలీ అని స్త్రీలు ర్యాలీ తీశారు. వాళ్లను కూడా తీసుకెళ్లి పోలీస్ వ్యాన్ లో ఎక్కించారు. అరెస్ట్ చేశారు. నేను కోరేది ఒక్కటే. మీరు ఇవన్నీ ఆయన చేసిన కృషిని గుర్తించాలి. రేపు మన జీవితం ఏంటి.. ఉపాధి కలుగుతుందా లేదా? ఏంది మన ఆంధ్రప్రదేశ్ అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ధైర్యంగా ముందుకు వచ్చి మీ ఓటు వేయాలి.. అని భువనేశ్వరి కోరారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.