old man compares congress and brs party
KCR : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో తెలంగాణలో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాయి. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అందులో కాంగ్రెస్ పార్టీ అయితే జోరు మీద ఉంది. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి బలం వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా జోరుమీదున్నారు. తెలంగాణ అంతటా కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలే వీస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే తెలంగాణలో అసలు ప్రజలు ఎవరి వైపు ఉన్నారు. అధికార బీఆర్ఎస్ వైపా.. లేక కాంగ్రెస్ వైపా.. ఎవరి వైపు ఉన్నారు అనే దానిపై క్లారిటీ లేదు. కానీ.. కొన్ని యూట్యూబ్ చానెళ్లు అయితే ఇప్పటికే తెలంగాణ ప్రజల నాడి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఓ పెద్దాయన మాత్రం ఓ రేంజ్ లో తెలంగాణ రాజకీయాల మీద ఫైర్ అయ్యాడు. అధికార బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ అంటే అభిమానం అంటూ ఆ పెద్దాయన చెప్పుకొచ్చాడు.
రాజశేఖర్ రెడ్డి చేసిన మేలు ఏంటో మాకు తెలుసు. కాంగ్రెస్ చేసిన మేలు ఎవ్వరూ చేయలేదు. కేసీఆర్ వచ్చి ఏం చేసిండు. పించను గించను అంటూ ఇస్తున్నాడు కానీ.. 6 నెలల నుంచి పించనే రాలేదు. కేసీఆర్ వల్ల ఏం రాలేదు. ఒక్క ఇల్లు కట్టించాడా చెప్పమను. ఏం లేదు. ఎక్కడైనా కేసీఆర్ వల్ల ఏం జరగలేదు. నీరుడు ఒక వెయ్యి వేసిండు.. ఇప్పుడు ఇంకో వెయ్యి వేసిండు.. అంతే. ఆయన మోదీ రెండు వేలు ఏసిండు. ఆయన, ఈయన ఎవ్వరూ చేసిందేం లేదు. కేసీఆర్ వల్ల అయ్యేదేం లేదు. స్టేజీ మీద అయ్యా కొడుకులు మీసాలు లేకుండా మాటలు చెప్పడం కాదు. ఇవన్నీ వట్టి మాటలే. మధిర మండలంలో ఏం చేయలేదు. మళ్లీ కేసీఆర్ వస్తే అడ్డుకోవడమే జనాలు. కేసీఆర్ వల్ల ఏం కాదు. కాంగ్రెస్ రావాలి.. కేసీఆర్, ఆయన కొడుకు ఇద్దరినీ తొక్కి పడేయడమే అంటూ చెప్పుకొచ్చాడు ఆ పెద్దాయన.
మాకు ఇల్లు ఇచ్చింది వాళ్లే.. చోటు ఇచ్చింది వాళ్లే. వీళ్లు ఏం ఇచ్చారు. ఏం ఇవ్వలేదు. కేసీఆర్ వల్లనే పెగలదు.. మాకు భట్టీ గారు రావాలి. ఆయనే గెలుస్తాడు. కాంగ్రెస్ ఎక్కడ చూసినా గెలుస్తుంది. కాంగ్రెస్ వస్తేనే అన్ని పథకాలు ఉంటాయి. మళ్లీ కాంగ్రెస్ రావాలి.. అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని ఆ పెద్దాయన కుండ బద్ధలు కొట్టాడు.
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
This website uses cookies.