Chandrababu : వైజాగ్ జనాలకి బీపీ తెప్పిస్తున్న చంద్రబాబు – తరిమి కొడుతున్నారు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : వైజాగ్ జనాలకి బీపీ తెప్పిస్తున్న చంద్రబాబు – తరిమి కొడుతున్నారు !

Chandrababu : విశాఖపట్టణాన్ని ఎవరైనా కాపాడండి.. లేకపోతే వైజాగ్ రూపురేఖలే మారిపోతాయి. వైజాగ్ ను కాపాడాలి. విశాఖను ఎవరు కాపాడుతారు.. ఎవరు కాపాడగలరు.. ఇదిగో ఇదే ప్రస్తుతం టీడీపీ నినాదాలు. అవును.. విశాఖను కాపాడేది ఎవరు అంటే టీడీపీ అనే సమాధానం అందరి నోట్లో నుంచి రావాలి. టీడీపీ అధికారంలో ఉంటేనే విశాఖ అనేది స్వర్గంగా ఉంటుంది. లేకపోతే విశాఖపట్టణం నరకమే. ఈ పరివర్తన ప్రజల్లో రావాలి. జనాల్లో వస్తే ఇక తిరుగే ఉండదు. వైసీపీ అధికారంలోకి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :20 June 2023,3:00 pm

Chandrababu : విశాఖపట్టణాన్ని ఎవరైనా కాపాడండి.. లేకపోతే వైజాగ్ రూపురేఖలే మారిపోతాయి. వైజాగ్ ను కాపాడాలి. విశాఖను ఎవరు కాపాడుతారు.. ఎవరు కాపాడగలరు.. ఇదిగో ఇదే ప్రస్తుతం టీడీపీ నినాదాలు. అవును.. విశాఖను కాపాడేది ఎవరు అంటే టీడీపీ అనే సమాధానం అందరి నోట్లో నుంచి రావాలి. టీడీపీ అధికారంలో ఉంటేనే విశాఖ అనేది స్వర్గంగా ఉంటుంది. లేకపోతే విశాఖపట్టణం నరకమే. ఈ పరివర్తన ప్రజల్లో రావాలి. జనాల్లో వస్తే ఇక తిరుగే ఉండదు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన గత నాలుగేళ్లలోనే వైసీపీ విశాఖను నాశనం చేసింది అనేదే టీడీపీ కాన్సెప్ట్. టీడీపీ అధికారంలోకి వస్తేనే విశాఖను కాపాడగలుగుతాం అనే విషయాన్ని ప్రజల్లోకి ఎక్కించాలి. దాని కోసం టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ఇప్పుడు టీడీపీకి ఒక మంచి అవకాశం దొరికింది. అదే వైజాగ్ ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేయడం. దానికి అదునుగా తీసుకొని రెచ్చిపోతోంది టీడీపీ. విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ కి, వైసీపీ పార్టీకి సంబంధం ఉందా? కానీ.. వైసీపీకి, ఆ కిడ్నాప్ ను లింక్ చేస్తున్నారు.

tdp slogans to save vishakapatnam

tdp slogans to save vishakapatnam

Chandrababu : విశాఖను కాపాడుకుందాం అంటూ టీడీపీ భారీ ర్యాలీ

ఇక.. చాన్స్ దొరికిందని విశాఖ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. విశాఖను కాపాడుకుందాం అంటూ నినదిస్తున్నారు. గంజాయి మాఫియా నుంచి, ల్యాండ్ మాఫియా నుంచి విశాఖను కాపాడుకుందాం అంటున్నారు. కిడ్నాపర్ల నుంచి విశాఖను రక్షించుకుందామని టీడీపీ నేతలు వీధుల్లోకి వచ్చి మరీ నినదిస్తున్నారు. అంటే.. వైసీపీ వల్ల విశాఖలో అరాచకాలు పెరిగాయని ప్రజల్లో బలంగా ఉండిపోయేలా చేయడమే టీడీపీ నేతల ముఖ్య ఉద్దేశం. కానీ.. విశాఖ ప్రజలకు తెలియదా.. ఎవరు విశాఖను నాశనం చేశారు.. ఎవరు బాగు చేస్తున్నారని. టీడీపీ వ్యూహాలను ఆమాత్రం పసిగట్టలేరా?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది