Today Top News : కూలిన నిర్మాణంలో ఉన్న ప్రైవేట్ ఇండోర్ స్టేడియం.. ఒక్కొక్కరు పది ఓట్లు వేయండి.. నిరుద్యోగులకు హామీ ఇచ్చిన కేటీఆర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Top News : కూలిన నిర్మాణంలో ఉన్న ప్రైవేట్ ఇండోర్ స్టేడియం.. ఒక్కొక్కరు పది ఓట్లు వేయండి.. నిరుద్యోగులకు హామీ ఇచ్చిన కేటీఆర్

Today Top News : వైఎస్ జగన్(YS Jagan) తనకు పెద్దన్న లాంటి వారని.. ప్రముఖ యూట్యూబర్ సందీష్ తో జరిగిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్(Minister KTR) చెప్పుకొచ్చారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, తాను ఇద్దరం కలిసి దావోస్ పర్యటనలో 2 గంటల పాటు కలిసి డిన్నర్ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు మేం భరోసా ఇస్తున్నాం. ఎన్నికల ఫలితాలు వెలువడిన తెల్లారే నాలుగో తేదీన 10 గంటలకు అశోక్ నగర్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :20 November 2023,9:34 pm

ప్రధానాంశాలు:

  •  గాంధీ భవన్ వద్ద స్కాంగ్రెస్ పోస్టర్ల కలకలం

  •  ప్రగతి భవన్లో కేటీఆర్‌ని కలిసిన ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర నాయకులు

  •  అశ్వారావుపేట రోడ్ షోలో గులాబీల జెండలే పాటకు స్టెప్పులేసిన కేటీఆర్

Today Top News : వైఎస్ జగన్(YS Jagan) తనకు పెద్దన్న లాంటి వారని.. ప్రముఖ యూట్యూబర్ సందీష్ తో జరిగిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్(Minister KTR) చెప్పుకొచ్చారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, తాను ఇద్దరం కలిసి దావోస్ పర్యటనలో 2 గంటల పాటు కలిసి డిన్నర్ చేశామని గుర్తు చేశారు.

ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు మేం భరోసా ఇస్తున్నాం. ఎన్నికల ఫలితాలు వెలువడిన తెల్లారే నాలుగో తేదీన 10 గంటలకు అశోక్ నగర్ లో యువతతో సమావేశం అవుతామని మంత్రి కేటీఆర్(Minister KTR) మాటిచ్చారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్యను మరింతగా పెంచుతామన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక్కొక్కరు పది ఓట్లు వేయాలంటూ ప్రజలకు బీజేపీ ఎంపీ బండి సంజయ్(BJP Mp Bandi Sanjay) సూచించారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో కూలిన నిర్మాణంలో ఉన్న ప్రైవేటు ఇండోర్ స్టేడియం(Private Indore stadium). ఇద్దరు మృతి.

పరకాల సభలో సీఎం సీఎం అంటూ జనాలు అరుస్తుంటే వాళ్లను ఇంకా అరవండి అంటూ ప్రోత్సహించిన రేవంత్ రెడ్డి(Revanth Reddy)

తెలంగాణలో ప్యాసింజర్ ఆటో డ్రైవర్ల(Passenger Auto drivers)కు సుమారు రూ.100 కోట్ల ఫిట్ నెస్, పర్మిట్ ఫీజులు మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్(CM KCR).

గతంలో ఎస్పీ కారును ఢీకొట్టి పోలీసుల మీద దాడి చేసి పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ చేశానని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన జగ్గారెడ్డి(Jaggareddy).

అశ్వారావుపేటలో రోడ్ షోలో(Aswaraopet Road Show) గులాబీల జెండలే పాటకు స్టెప్పులేసి బీఆర్ఎస్ కార్యకర్తలను ఉత్సాహపరిచిన మంత్రి కేటీఆర్(Minister KTR).

ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసిన ప్రైవేట్ టీచర్స్ ఫోరం(Private teachers forum) రాష్ట్ర నాయకులు. ఈసందర్భంగా ప్రైవేట్ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్(BRS) పార్టీకి తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

గాంధీ భవన్ వద్ద స్కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు(Gandhi Bhavan Scamgress Guarantee card) పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన స్కామ్ ల జాబితాతో పోస్టర్లు కలకలం సృష్టించాయి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది