
ias vijay kumar join in ysrcp Ys jagan offered mp seat
YS jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో పాలనపరంగా అనేక మార్పులు తీసుకురావడం తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకే చేరుకునే రీతిలో… వ్యవస్థను పూర్తిగా మార్చేశారు. ప్రజలు నాయకులు మరియు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగనిచ్చే పరిస్థితి లేకుండా… వారి చెంతకు పాలన సీఎం జగన్ తీసుకెళ్లడం జరిగింది. దీనిలో భాగంగా గ్రామ మరియు వార్డు వాలంటీర్ల వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మొదటి తారీకు నాడే రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు ఇంటి వద్దకే వాలంటీర్లు అందించటం.. ఇంకా ఎత్తరా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పనులను వాలంటీర్లు దగ్గరుండి చూసుకుంటున్నారు.
ఎక్కడా కూడా ప్రభుత్వ పథకాలు సేవలు ప్రజలకు అందడంలో ఎక్కడ నిర్లక్ష్యం ఆలస్యం… జరగకుండా గ్రామ మరియు వార్డు సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ పటిష్టంగా పనిచేసేలా సీఎం జగన్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను నిస్వార్ధంగా అమలు చేస్తూ పనిచేస్తున్న వాలంటీర్లను ప్రభుత్వం సత్కరించే కార్యక్రమం ఈ ఏడాది కూడా చేయడానికి పూనుకుంది. ఈ నెల 19న విజయవాడలో ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను ప్రభుత్వం సత్కరించడానికి రెడీ అయింది. దాదాపు నెల రోజులపాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో.. ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను సత్కరించటమే కాకుండా నగదు బహుమతి కూడా అందించేలా… వాలంటీర్లకు వందనం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నెల రోజులపాటు జరిపించడానికి రెడీ అయింది.
YS jagan-governments-good-news-for-village-and-ward-volunteers-will-be-implemented-from-this-month
ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను సేవా వజ్ర, సేవా మిత్ర అవార్డులకు ఎంపిక చేయనున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఉత్తమ సేవలందించిన ఐదుగురు వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డు ప్రధానం ఈనెల 19న చేయనున్నారు. ఈ అవార్డుతో పాటు 30 వేల రూపాయల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్ అందజేయనున్నారు. సేవా రత్న అవార్డు అందుకునే వారికి 20 వేల నగదు, మెడల్, బ్యాడ్జి, శాలువా సర్టిఫికెట్ లు అందజేయనున్నారు. ఇక మూడో అవార్డు విషయానికొస్తే ఏడాది పాటు సర్వీస్ పూర్తి చేసుకుని ఎలాంటి ఫిర్యాదు లేకుండా పనిచేసిన గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు సేవ మిత్ర అవార్డు అందజేయనున్నారు. ఈ అవార్డుతో పాటు పదివేల నగదు బహుమతి అందుకోబోతున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం ఏప్రిల్ నెలలో నిర్వహించాలని జగన్ ప్రభుత్వం భావించింది. కానీ ఆ సమయంలో కొన్ని అనుకోని కారణాలవల్ల వాయిదా పడింది. కాగా ఈనెల 19న గ్రామ, వార్డు వాలంటీర్లకు అవార్డుల ప్రధానం చేయనున్నారు.
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…
New COVID Variant : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'BA.3.2' 'సికాడా' వేరియంట్ వార్తలు ప్రజల్లో…
IPL 2026 RCB vs SRH : ఐపీఎల్ 2026 IPL 2026 సీజన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB…
Chicken Price Drop : ఆదివారం వస్తే చాలు ముక్క లేనిదే ముద్ద దిగని నాన్-వెజ్ ప్రియులకు ఇది నిజంగా…
Gold Silver Rate 29th March 2026 : బంగారం కొనుగోలు చేయాలనుకునే పసిడి ప్రియులకు ఇది నిజంగా షాకింగ్…
pachhi chintapandu rasam recipe : పచ్చి చింతకాయలతో తయారుచేసే రసం అనేది మన తెలుగు ఇంటి వంటల్లో ఒక…
Coffee On Empty Stomach : చాలా మంది ఉదయాన్నే నిద్రలేవగానే కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఇది సాధారణంగా…
Health : వాము ఆకులు మనకు అందుబాటులో ఉండే సాధారణ మొక్కలలో ఒకటి అయినప్పటికీ వాటి ఔషధ విలువలు చాలా…
This website uses cookies.