Ys Jagan : కొన్నిసార్లు మన జీవితంలో జరిగే కొన్ని చేదు జ్ఞాపకాలు మనిషిలో సరికొత్త మార్పులను తీసుకువస్తాయి. జరిగినవి చేదు జ్ఞాపకాలు అయినప్పటికీ అవి తీపి మార్పుకు నాంది పలికితే కచ్చితంగా అలాంటి మార్పును స్వాగతించవచ్చు. అయితే ఆ మార్పు అనేది ఎంత కాలం ఉంటుంది. అది నిజమైన మార్పు అని నమ్మవచ్చా అంటే వాటిని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు అలాంటి మార్పే వైయస్ జగన్ లో కనిపిస్తుందని పలువురు చెబుతున్నారు. ఇంతకాలం కనీసం తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా వైయస్ జగన్ కలవరు అనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి. కానీ ఇటీవల 2024 ఎన్నికల్లో భాగంగా ఎదురైన ఘోర ఓటమి అనంతరం వైయస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే జూన్ 22న (శనివారం) ఉదయం తాడేపల్లి లోని క్యామ్ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది.
దీనిలో భాగంగా వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి పోటీ చేసినటువంటి అభ్యర్థుల తో వైయస్ జగన్ భేటీ కానున్నారు. వీరితోపాటు ఎంపీలు పార్లమెంట్ నుండి పోటీ చేసిన అభ్యర్థులను కూడా వైయస్ జగన్ కలవనున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన చర్చ ఒకటి తెరపైకి వచ్చింది.అయితే వాస్తవానికి వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా పరదాలకు పరిమితం అయ్యారనే వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి. ప్రజల సంగతి పక్కన పెడితే కనీసం సొంత పార్టీ నాయకులను కూడా వైయస్ జగన్ కలవడం లేదని పలు సందర్భాలలో సొంత పార్టీ మంత్రులకు సైతం చేదు అనుభవాలు ఏదైనా పరిస్థితులు ఉన్నాయని వార్తలు ఉన్నాయి.
ఇలాంటి నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జగన్ కు ఊహించని షాక్ ఇచ్చాయని పలువురు అంటున్నారు. దీంతో ప్రస్తుతం వైఎస్ జగన్ తన పార్టీ నేతలతో భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిలో భాగంగానే క్షేత్రస్థాయిలో వైసీపీ సర్కార్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు , ఈ ఘోర ఓటమికి గల కారణాలు సర్వేల ద్వారా కాకుండా స్థానిక నేతలు నుండి తెలుసుకునే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింటా హల్ చల్ చేస్తున్నాయి. ఇదేదో కనీసం ఎన్నికలకు 6 నెలల ముందు చేసిన పరిస్థితి వేరేగా ఉండేది కదా అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జగన్ లో పెను మార్పును తీసుకువచ్చాయని పలువురు చెబుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.