Chandrababu naidu : తెదేపా హయాంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తే.. జగన్ విధ్వంసానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. కర్నూలు కింగ్ మార్కెట్ నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన చంద్రబాబు రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతిన్నదని ఆలయాలపై దాడులు చేస్తున్నారన్న చంద్రబాబు.. ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారన్నారు.
పోలీసులు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్.. ఏబీసీడీ పాలన తెచ్చారని దుయ్యబట్టారు. ఏ అంటే అట్రాసిటీ, ఆటవిక పాలన.. బీ అంటే బాదుడు, సీ అంటే అవినీతి, డీ అంటే విధ్వంసమని వ్యాఖ్యానించారు. అమరావతిని సర్వనాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
బాబాయిని ఎవరో చంపారని ఆనాడు అన్నారు. ఈరోజు ఎవరు చంపారో అర్థం అయ్యింది. నాకు అన్యాయం జరిగిందని షర్మిల రోడ్డెక్కారు. సమైక్యాంధ్రలో నేనే ఎక్కువ కాలం పని చేశాను. చిత్తూరులో ఏకగ్రీవాలు చేశారు. తిరుపతిలోకి నాకు అనుమతి ఇవ్వలేదు. చరిత్రలో ఎన్నడూ ఇన్ని ఏకగ్రీవాలు జరగలేదు. నామినేషన్లు అన్నీ సక్రమంగా ఉన్నా రిజెక్ట్ చేశారు. 50 శాతంపైగా నెగ్గేవాళ్లం. అర్ధరాత్రి డ్రామా జరిగిందని చంద్రబాబు అన్నారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ప్రచారం చేయటంతో, టీడీపీ శ్రేణుల్లో ఉత్సహం నెలకొని ఉంది. మరోపక్క యువనేత నారా లోకేష్ కూడా విశాఖ నుండి ప్రచారం మొదలుపెట్టాడు. తండ్రి రాయలసీమ నుండి కొడుకు ఉత్తరాంధ్ర నుండి ప్రచారం చేయటం విశేషం. మరోపక్క వైసీపీ మాత్రం రాష్ట్రంలో ఏకగ్రీవాల విషయంలో ముందడుగులో ఉంది. ఇప్పటికే నాలుగు మున్సిపాలిటీ లను కైవసం చేసుకుంది. చాలా చోట్ల డివిజన్స్ వారీగా భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు జరిగాయి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.