
cm jagan and chandrababu naidu
Chandrababu naidu : తెదేపా హయాంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తే.. జగన్ విధ్వంసానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. కర్నూలు కింగ్ మార్కెట్ నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన చంద్రబాబు రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతిన్నదని ఆలయాలపై దాడులు చేస్తున్నారన్న చంద్రబాబు.. ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారన్నారు.
Chandrababu naidu : ys Jagan was giving priority to destruction : chandrababu
పోలీసులు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్.. ఏబీసీడీ పాలన తెచ్చారని దుయ్యబట్టారు. ఏ అంటే అట్రాసిటీ, ఆటవిక పాలన.. బీ అంటే బాదుడు, సీ అంటే అవినీతి, డీ అంటే విధ్వంసమని వ్యాఖ్యానించారు. అమరావతిని సర్వనాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
బాబాయిని ఎవరో చంపారని ఆనాడు అన్నారు. ఈరోజు ఎవరు చంపారో అర్థం అయ్యింది. నాకు అన్యాయం జరిగిందని షర్మిల రోడ్డెక్కారు. సమైక్యాంధ్రలో నేనే ఎక్కువ కాలం పని చేశాను. చిత్తూరులో ఏకగ్రీవాలు చేశారు. తిరుపతిలోకి నాకు అనుమతి ఇవ్వలేదు. చరిత్రలో ఎన్నడూ ఇన్ని ఏకగ్రీవాలు జరగలేదు. నామినేషన్లు అన్నీ సక్రమంగా ఉన్నా రిజెక్ట్ చేశారు. 50 శాతంపైగా నెగ్గేవాళ్లం. అర్ధరాత్రి డ్రామా జరిగిందని చంద్రబాబు అన్నారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ప్రచారం చేయటంతో, టీడీపీ శ్రేణుల్లో ఉత్సహం నెలకొని ఉంది. మరోపక్క యువనేత నారా లోకేష్ కూడా విశాఖ నుండి ప్రచారం మొదలుపెట్టాడు. తండ్రి రాయలసీమ నుండి కొడుకు ఉత్తరాంధ్ర నుండి ప్రచారం చేయటం విశేషం. మరోపక్క వైసీపీ మాత్రం రాష్ట్రంలో ఏకగ్రీవాల విషయంలో ముందడుగులో ఉంది. ఇప్పటికే నాలుగు మున్సిపాలిటీ లను కైవసం చేసుకుంది. చాలా చోట్ల డివిజన్స్ వారీగా భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు జరిగాయి.
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
This website uses cookies.