Ys Jagan : మొన్న ఈ మధ్య రిపబ్లిక్ టీవీలో వైసీపీకి వ్యతిరేకంగా కొన్ని వార్తలు ప్రచారం అయ్యాయి. మరికొద్ది రోజుల్లో వైసీపీ లో తిరుగుబాటు చెలరేగే అవకాశం ఉందని ఆ ఛానల్ కథనాలు ప్రచారం చేసింది. దానిని వైసీపీ నేతలు ఖండించిన విషయం కూడా తెలిసిందే, అయితే తాజాగా తిరుపతి ఉప ఎన్నికల సందర్బంగా జరిగిన కొన్ని సంఘటనలు గమనిస్తే ఈ వార్తల్లో నిజముందని తెలుస్తుంది.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు జరుగుతున్నా నేపథ్యంలో ఆ పార్లమెంట్ పరిధికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యి, తాము లేనిదే ఇక్కడ వైసీపీ గెలవదని తమతోనే పార్టీ డెవలప్ అయిందని అనుకున్నారట. అంతేకాకుండా తాము సూచించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం వద్ద డిమాండ్ చేయాలని అనుకున్నారట.ఇంటలీజెన్స్ వర్గాల ద్వారా వైఎస్ జగన్ కు ఈ సమాచారం చేరుకోవడంతో జగన్ అప్రమత్తమయ్యారట. అప్పటికే జగన్ మనసులో ఉన్న గురుమూర్తిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించేశారు. అయితే జగన్ షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడి ఎమ్మెల్యేలు మంత్రులు షాక్ కు గురయ్యారు.
అదే విధంగా తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసి, గురుమూర్తిని గెలిపించవల్సిన బాధ్యత జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు అప్పగించాడు జగన్. దీనితో ఇక వాళ్ళు చేసేది ఏమి లేక మౌనంగా సరే అని వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. దీనిని బట్టి చూస్తే వైసీపీ లో చిన్నపాటి వ్యతిరేకత జగన్ మీద ఉన్నట్లు సృష్టంగా తెలుస్తుంది.
తన మీద ఎంత వరకు వ్యతిరేకత ఉంది అనే విషయం కూడా సీఎం జగన్ కు తెలిసే ఉంటుంది. అందుకే సొంత పార్టీలో కూడా జగన్ తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఫిజియోథెరపిస్టు అయిన గురుమూర్తిని పిలిచి మరి ఎంపీ టిక్కెట్ ఇచ్చాడు జగన్. వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన చెల్లెలు పాదయాత్ర చేసిన విషయం తెలిసింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఫిజియోథెరఫిస్ట్ గురుమూర్తి.. చెల్లెలు షర్మిలకు వైద్యుడిగా ఉన్నారు. ఆ తరువాత జగన్ కు కూడా వైద్యం అందించారు. ఆయన చేసిన సేవలకు వైద్య రంగంలో ఏదో ఒక పదోన్నతి కల్పించాలని భావించారు. ఇంతలో తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనితో ఈ స్థానం గురుమూర్తికి ఇచ్చాడు జగన్.
ఒక్క గురుమూర్తి మాత్రమే కాదు. వైసీపీ లో కార్పొరేటర్లు నుండి మంత్రుల వరకు పెద్దగా రాజకీయానుభవం లేని నేతలకు జగన్ అవకాశాలు ఇస్తున్నాడు. దీనితో ఆయా నేతలు ఎప్పటికి కూడా జగన్ మాట దాటిపోకుండా నిబద్దతతో పనిచేస్తారు. గతంలో ఇందిరాగాంధీ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు ఇలాంటి రాజకీయాలే చేశారు . అందుకే వాళ్ళు చనిపోయిన కానీ వాళ్ళ హయాంలో రాజకీయంగా ఎదిగిన నేతల్లో ఎక్కువ మంది ఇప్పటికి అవే పార్టీలో కొనసాగుతున్నారు .
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.