ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేడు తెలంగాణలో కనబడకుండా పోగా, విభజిత ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలోనైనా అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంస్థాగతంగా టీడీపీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించనున్నారు. కందుకూరు మాజీ శాసన సభ్యుడు డాక్టర్ దివి శివరాం ఆధ్వర్యంలో నూతన కమిటీల ఎంపిక సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నట్లు టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి గోచిపాతెల మోషె సోమవారం తెలిపారు.
సోమవారం గుడ్లూరు, లింగసముద్రం, ఉలవపాడు, మంగళవారం కందుకూరు, వలేటివారిపాలెం కమిటీల ఎన్నిక జరగనుంది. ఇకపోతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోగా, కేడర్ కూడా దాదాపుగా వెళ్లిపోయింది. విభజిత ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ అధికార వైసీపీపై పోరాటం చేస్తున్నది. టీడీపీ భావినేతగా నారా లోకేశ్ ఉంటారని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.