ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేడు తెలంగాణలో కనబడకుండా పోగా, విభజిత ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలోనైనా అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంస్థాగతంగా టీడీపీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించనున్నారు. కందుకూరు మాజీ శాసన సభ్యుడు డాక్టర్ దివి శివరాం ఆధ్వర్యంలో నూతన కమిటీల ఎంపిక సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నట్లు టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి గోచిపాతెల మోషె సోమవారం తెలిపారు.
సోమవారం గుడ్లూరు, లింగసముద్రం, ఉలవపాడు, మంగళవారం కందుకూరు, వలేటివారిపాలెం కమిటీల ఎన్నిక జరగనుంది. ఇకపోతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోగా, కేడర్ కూడా దాదాపుగా వెళ్లిపోయింది. విభజిత ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ అధికార వైసీపీపై పోరాటం చేస్తున్నది. టీడీపీ భావినేతగా నారా లోకేశ్ ఉంటారని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
This website uses cookies.