ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేడు తెలంగాణలో కనబడకుండా పోగా, విభజిత ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలోనైనా అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంస్థాగతంగా టీడీపీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించనున్నారు. కందుకూరు మాజీ శాసన సభ్యుడు డాక్టర్ దివి శివరాం ఆధ్వర్యంలో నూతన కమిటీల ఎంపిక సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నట్లు టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి గోచిపాతెల మోషె సోమవారం తెలిపారు.
సోమవారం గుడ్లూరు, లింగసముద్రం, ఉలవపాడు, మంగళవారం కందుకూరు, వలేటివారిపాలెం కమిటీల ఎన్నిక జరగనుంది. ఇకపోతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోగా, కేడర్ కూడా దాదాపుగా వెళ్లిపోయింది. విభజిత ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ అధికార వైసీపీపై పోరాటం చేస్తున్నది. టీడీపీ భావినేతగా నారా లోకేశ్ ఉంటారని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.