India vs England : క్లోహీ, రోహిత్ కోసం ఫ్యాన్స్ వేయిటింగ్.. మొదటి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్..!
ప్రధానాంశాలు:
India vs England : క్లోహీ, రోహిత్ కోసం ఫ్యాన్స్ వేయిటింగ్.. మొదటి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్..!
India vs England : ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు India vs England భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ ODI జరగనుంది. ఈ మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మ, Virat Kohli విరాట్ కోహ్లీలకు ఈ సిరీస్ చాలా ముఖ్యం. ఛాంపియన్స్ ట్రోఫీ పరంగా ఈ సిరీస్ రెండు జట్లకు చాలా ముఖ్యమైనది. గెలిచి ఆత్మవిశ్వాసంతో కూడగట్టుకోవాలనే ఉద్దేశంతోనే రెండు టీమ్స్ మైదానంలోకి దిగుతున్నాయి. నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతుంది.
![India vs England క్లోహీ రోహిత్ కోసం ఫ్యాన్స్ వేయిటింగ్ మొదటి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/India-vs-England.jpg)
India vs England : క్లోహీ, రోహిత్ కోసం ఫ్యాన్స్ వేయిటింగ్.. మొదటి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్..!
ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే తొలి వన్డేను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు. అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్నూ ఉచితంగా స్ట్రీమింగ్ సదుపాయం ఉంది. టీ20లో అదరగొట్టిన శివమ్ దూబే, అభిషేక్ శర్మలకి ఇందులో చోటు దక్కలేదు. గాయం కారణంగా కోహ్లీ ఈ మ్యాచ్కి దూరమయ్యాడు.
India vs England ఇంగ్లాండ్ జట్టు
బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహ్మద్.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా