IND VS PAK : పాకిస్థాన్ ఆల్ ఔట్.. భారత్‌కు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన దాయాది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

IND VS PAK : పాకిస్థాన్ ఆల్ ఔట్.. భారత్‌కు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన దాయాది

IND VS PAK : పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు మరి. భారత్ ఈ మ్యాచ్ ను చాలెంజింగ్ గా తీసుకుంది. అందుకే పాకిస్థాన్ ను భారత బౌలర్లు ఎక్కడికక్కడ కట్టడి చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లు కూడా పాకిస్థాన్ ఆడలేకపోయింది. 42.5 ఓవర్లకే పాకిస్థాన్ ఆల్ ఔట్ అయింది. 191 పరుగులు మాత్రమే చేసింది. 192 పరుగుల యావరేజ్ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది పాకిస్థాన్. భారత్ కు 25 నుంచి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :14 October 2023,5:47 pm

IND VS PAK : పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు మరి. భారత్ ఈ మ్యాచ్ ను చాలెంజింగ్ గా తీసుకుంది. అందుకే పాకిస్థాన్ ను భారత బౌలర్లు ఎక్కడికక్కడ కట్టడి చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లు కూడా పాకిస్థాన్ ఆడలేకపోయింది. 42.5 ఓవర్లకే పాకిస్థాన్ ఆల్ ఔట్ అయింది. 191 పరుగులు మాత్రమే చేసింది. 192 పరుగుల యావరేజ్ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది పాకిస్థాన్. భారత్ కు 25 నుంచి 30 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదించే సత్తా ఉంది. అంటే.. ఈ మ్యాచ్ కూడా భారత్ గెలుపు వశం అయినట్టే అని అనుకోవచ్చు. ఈ మ్యాచ్ కూడా భారత్ గెలిచేస్తే వరల్డ్ కప్ పట్టికలో ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్లిపోతుంది. ఇప్పటికే భారత్ కు నాలుగు పాయింట్లు వచ్చాయి.

ఇక.. పాకిస్థాన్ బ్యాటింగ్ చూసుకుంటే.. కెప్టెన్ బాబర్ అజామ్ మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత రిజ్వాన్ 49 పరుగులు చేశాడు. అబ్దుల్లా 20 పరుగులు, ఇమామ్ 36 పరుగులు, షకీల్ 6, అహ్మద్ 4, షాదాబ్ ఖాన్ 2, నవాజ్ 4, హసన్ అలీ 12, అఫ్రిది 2, హరీస్ 2 పరుగులు చేసి స్కోర్ ను 191 వరకు లాక్కొచ్చారు. ఇక.. భారత బౌలర్లలో చూసుకుంటే ఒక్క శార్దూల్ ఠాకూర్ తప్ప మిగితా వాళ్లంతా తలో రెండు వికెట్లు తీశారు. బుమ్రా 2, సిరాజ్ 2, హార్దిక్ పాండ్యా 2, కుల్దీప్ యాదవ్ 2, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశారు.

pakistan all out for 191 runs in india vs pakistan match

#image_title

IND VS PAK : శుభ్‌మన్ గిల్ నే నమ్ముకున్న టీమిండియా

ఐసీసీ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు శుభ్‌మన్ గిల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ.. పాకిస్థాన్ మ్యాచ్ లో అడుగుపెట్టాడు. ఇంకాసేపట్లో భారత్ బ్యాటింగ్ ప్రారంభం కానుంది. ఓపెనర్ గా శుభ్ మన్, కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నారు. ఈ మ్యాచ్ దాదాపుగా భారత్ కు గెలుపు అయినట్టే అనుకోవాలి. పాకిస్థాన్ రన్ రేట్ 4.45 మాత్రమే ఉంది. చాలా తక్కువగా ఉంది. దీంతో పాక్ పాయింట్లు మరింత కిందికి పడిపోనున్నాయి. ఈ మ్యాచ్ గెలిచి వరల్డ్ కప్ లో భారత్ ఓడించే దమ్ము పాక్ కు లేదని భారత్ మరోసారి నిరూపించనుంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది