Rohit Sharma : ఓపెనర్ గా వద్దు.. ఇకపై ఆ ప్లేస్ లో రోహిత్ శర్మ.. బీసీసీఐ కొత్త ఆలోచన..?

 Authored By sekhar | The Telugu News | Updated on :8 December 2022,8:30 pm

Rohit Sharma : భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అనేక విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. T20 వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత రోహిత్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కెప్టెన్ గా ఏమాత్రం కొనసాగడానికి వీలులేదని మండిపడుతున్నారు. T20 వరల్డ్ కప్ టోర్నీలో ఒక్క మ్యాచ్ లో కూడా… సరిగ్గా రాణించలేకపోయారని క్రికెట్ ప్రేమికులు విమర్శలు చేయడం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం టీమిండియా… బంగ్లాదేశ్ టూర్ లో ఉంది. అయితే రెండో వన్డే జరుగుతున్న సమయంలో..

రోహిత్ కి చాలా బలమైన గాయం తగిలింది. గాయం కారణంగా గ్రౌండ్ నుండి నేరుగా హాస్పిటల్ కి వెళ్లాల్సిన పరిస్థితి. అయితే అంత గాయం అయిన గాని మ్యాచ్ చేయి జారిపోతున్న సమయంలో తొమ్మిదో స్థానంలో… వచ్చి 28 మంత్రుల 51 పరుగులు చేసి అదరగొట్టాడు. రోహిత్ ఆట తీరుబట్టి చాలా వరకు మ్యాచ్ గెలిచేస్తుందని అందరూ భావించారు. కాని చివర ఆఖరికి రోహిత్ పోరాడిన ఇండియా ఓడిపోయింది. పరిస్థితి ఇలా ఉంటే ఓపెనర్ గా రోహిత్ రాణించలేకపోతున్నాడని ఇకనుండి చివరిలో ధోనీ ప్లేసులో దించే ఆలోచనలో బీసీసీఐ కూడా కొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Rohit Sharma in dhonis place from now

Rohit Sharma in dhonis place from now

ఇదే తరహాలో క్రికెట్ ప్రేమికులు కూడా ఆశిస్తున్నారు. రోహిత్ ఓపెనర్ గా కాకుండా అప్పట్లో ధోని స్థానంలో లోయర్ ఆర్డర్ లో దిగితే… బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా రోహిత్ కి ఒకపక్క ఒత్తిడి ఉండదు. మరోపక్క..మ్యాచ్ లని  మంచి ఫినిషింగ్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పుకొస్తున్నారు. ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో మిడిల్ ఆర్డర్ లో వచ్చి… ఓటమి అంచులో ఉన్న అనేక మ్యాచ్ లను ఒంటి చేత్తో గెలిపించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ధోనీకి బెస్ట్ ఫినిషర్ గా కూడా పేరు ఉంది. ఇప్పుడు ధోని స్థానంలో రోహిత్ శర్మ వస్తే బాగుంటుందని క్రికెట్ ప్రేమికుల నుండి డిమాండ్ వినబడుతుంది.

sekhar

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి