Team India : దాయాదులు అయిన భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు టీ 20 వరల్డ్ కప్లో ఎన్నడూ పాకిస్థాన్ భారత్పై నెగ్గలేదు. ఈ క్రమంలోనే ఆదివారం జరగబోయే మ్యాచ్లో కూడా భారత్ గెలుపు ఖాయమని భారతీయులు ఆకాంక్షిస్తున్నారు. ఈ విషయమై ఇండియన్స్ ఆసక్తికరంగా చర్చించుకోవడంతో పాటు మ్యాచ్ కోసం వేచి చూస్తున్నారు. కాగా, టీమిండియాను ఓడించేందుకుగాను పాకిస్థాన్ క్రికెటర్స్కు ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్లర్ టిప్స్ ఇచ్చాడు.
చిరకాల ప్రత్యర్థులు అయినటువంటి భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోరులో భారత్దే విజయమని భారతీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ గెలుపును నిలువరించడం అసాధ్యమని అంటున్నారు కూడా. ఇప్పటి వరకు టీ20 వరల్డ్కప్ల్లో ఐదుసార్లు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడగా ఐదింటిలోనూ భారత జట్టు విజయం సాధించింది. టీ20లో మాత్రమే కాదు, వన్డేల్లోనూ పాకిస్థాన్ భారత్ను ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్స్ అందరి ఫేవరెట్ టీమ్ కూడా టీమిండియానే అన్న ప్రచారం సాగుతోంది. ఈ సంగతులు ఇలా ఉంచితే భారత జట్టును ఓడించాలంటే ఈ టిప్స్ ఫాలో అవండంటూ మూడు కామెడీ టిప్స్ షేర్ చేశాడు షోయబ్ అక్తర్. అవేంటంటే. ఇండియన్ క్రికెటర్స్కు స్టీపింగ్ ట్యాబ్లెట్స్ ఇవ్వాలనేది ఫస్ట్ టిప్.
కాగా, రెండోది విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ వాడకుండా టూ డేస్ ఆపడం.. ఇక థర్డ్ టిప్ ఏంటంటే.. టీమిండియా మెంటార్ గా ఉన్న ధోనీని బ్యాటింగ్కి రావొద్దని కోరడం. ఇలా ఆసక్తికర టిప్స్ ఇచ్చాడు షోయబ్ అక్తర్. ఆయన ఇచ్చిన టిప్స్ను బట్టి టీమిండియా ఈ సారి కూడా గెలిచేస్తుందని చెప్పకనే చెప్పాడంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. టీ 20 వరల్డ్ కప్లో టీమిండియాకు ధోని మెంటార్గా ఉండి.. ప్లేయర్స్కు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఫ్రీ గానే ఈ మెంటార్ బాధ్యతలను ధోని స్వీకరించాడు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.