ATM withdrawal : జాగ్రత్త.. మే 1 నుంచి ఏటీఎం విత్‌డ్రాలో కొత్త‌ నిబంధనలు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ATM withdrawal : జాగ్రత్త.. మే 1 నుంచి ఏటీఎం విత్‌డ్రాలో కొత్త‌ నిబంధనలు..

 Authored By ramu | The Telugu News | Updated on :26 April 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  ATM withdrawal : జాగ్రత్త.. మే 1 నుంచి ఏటీఎం విత్‌డ్రాలో కొత్త‌ నిబంధనలు..

ATM withdrawal :  మే 1వ తేదీ నుంచి బ్యాంక్ ఖాతాదారులకు ఏటీఎం వినియోగం మరింత ఖరీదైనదిగా మారనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజులను పెంచేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఒకరు తమ హోమ్ బ్రాంచ్ కాకుండా ఇతర బ్యాంకు ఏటీఎంలను ఉపయోగించి నగదు తీసుకుంటే చెల్లించాల్సిన రుసుము పెరుగుతుంది. గతంలో రూ.17గా ఉన్న ఫీజు ఇప్పుడు రూ.19కు చేరుకోనుంది. అలాగే బ్యాలెన్స్ తనిఖీ లావాదేవీకి రూ.6 బదులు రూ.7 ఛార్జ్ వసూలు కానుంది.

ATM withdrawal జాగ్రత్త మే 1 నుంచి ఏటీఎం విత్‌డ్రాలో కొత్త‌ నిబంధనలు

ATM withdrawal : జాగ్రత్త.. మే 1 నుంచి ఏటీఎం విత్‌డ్రాలో కొత్త‌ నిబంధనలు..

ATM withdrawal : ఇక నుండి ఏటీఎం లో ఇష్టం వచ్చినట్లు డ్రా చేసుకోవడం కుదరదు

ఈ కొత్త చార్జీలు హోమ్ బ్యాంక్ కంటే వేరే బ్యాంకు ఏటీఎంలను ఉపయోగించినప్పుడు మాత్రమే వర్తిస్తాయి. మెట్రో నగరాల్లో 5 ఉచిత లావాదేవీల తర్వాత, మెట్రోయేతర నగరాల్లో 3 ఉచిత లావాదేవీల తర్వాతే ఈ పెరిగిన ఫీజులు వర్తిస్తాయి. అదనంగా ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మినీ స్టేట్‌మెంట్, బ్యాలెన్స్ విచారణ వంటి సేవలకు కూడా రూ.10 + GST చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఖాతాలో సరిపడా నిధులు లేక లావాదేవీ విఫలమైతే, దానికి సంబంధించిన జరిమానా రూ.20 + GST కొనసాగుతుంది.

ఈ నిర్ణయం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా తీసుకురావబడింది. అయితే ఎస్‌బీఐ ఖాతాదారులకు తమ స్వంత ఏటీఎంలలో బ్యాలెన్స్ విచారణ, మినీ స్టేట్‌మెంట్ వంటి సేవలకు ఇప్పటికీ ఛార్జీలు ఉండవు. అయినప్పటికీ ఇతర బ్యాంకుల ఏటీఎంల వాడకాన్ని తగ్గించేందుకు, మరియు వినియోగదారుల డిజిటల్ లావాదేవీల వైపు మళ్ళించేందుకు ఈ నిర్ణయం కీలకమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇకపై ఏటీఎం వినియోగంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది