ATM withdrawal : జాగ్రత్త.. మే 1 నుంచి ఏటీఎం విత్డ్రాలో కొత్త నిబంధనలు..
ATM withdrawal : మే 1వ తేదీ నుంచి బ్యాంక్ ఖాతాదారులకు ఏటీఎం వినియోగం మరింత ఖరీదైనదిగా మారనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజులను పెంచేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఒకరు తమ హోమ్ బ్రాంచ్ కాకుండా ఇతర బ్యాంకు ఏటీఎంలను ఉపయోగించి నగదు తీసుకుంటే చెల్లించాల్సిన రుసుము పెరుగుతుంది. గతంలో రూ.17గా ఉన్న ఫీజు ఇప్పుడు రూ.19కు చేరుకోనుంది. అలాగే బ్యాలెన్స్ తనిఖీ లావాదేవీకి రూ.6 బదులు రూ.7 ఛార్జ్ వసూలు కానుంది.
ATM withdrawal : జాగ్రత్త.. మే 1 నుంచి ఏటీఎం విత్డ్రాలో కొత్త నిబంధనలు..
ఈ కొత్త చార్జీలు హోమ్ బ్యాంక్ కంటే వేరే బ్యాంకు ఏటీఎంలను ఉపయోగించినప్పుడు మాత్రమే వర్తిస్తాయి. మెట్రో నగరాల్లో 5 ఉచిత లావాదేవీల తర్వాత, మెట్రోయేతర నగరాల్లో 3 ఉచిత లావాదేవీల తర్వాతే ఈ పెరిగిన ఫీజులు వర్తిస్తాయి. అదనంగా ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ విచారణ వంటి సేవలకు కూడా రూ.10 + GST చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఖాతాలో సరిపడా నిధులు లేక లావాదేవీ విఫలమైతే, దానికి సంబంధించిన జరిమానా రూ.20 + GST కొనసాగుతుంది.
ఈ నిర్ణయం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా తీసుకురావబడింది. అయితే ఎస్బీఐ ఖాతాదారులకు తమ స్వంత ఏటీఎంలలో బ్యాలెన్స్ విచారణ, మినీ స్టేట్మెంట్ వంటి సేవలకు ఇప్పటికీ ఛార్జీలు ఉండవు. అయినప్పటికీ ఇతర బ్యాంకుల ఏటీఎంల వాడకాన్ని తగ్గించేందుకు, మరియు వినియోగదారుల డిజిటల్ లావాదేవీల వైపు మళ్ళించేందుకు ఈ నిర్ణయం కీలకమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇకపై ఏటీఎం వినియోగంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం.
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
This website uses cookies.