SBI : మీ ఎస్బీఐ ఖాతా నుండి అమౌంట్ కట్ అయిందా? అందుకు కారణం ఏంటంటే..!
ప్రధానాంశాలు:
SBI : మీ ఎస్బీఐ ఖాతా నుండి అమౌంట్ కట్ అయిందా? అందుకు కారణం ఏంటంటే..!
SBI : ఈ మధ్య అకౌంట్ హ్యాకింగ్ ఎక్కువ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్గా ఎలాంటి మెసేజ్ Message రాలేదు.? ఎవరికీ డబ్బులు పంపించలేదు. కానీ ఖాతా నుంచి రూ 236 కట్ అయ్యాయి. దీంతో అందరిలో ఆందోళన నెలకొంది. అయితే దీనికి కారణం ఏంటంటే..ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఎస్బీఐ ఏటీఎమ్ కార్డులను వసూలు చేస్తోంది.

SBI : మీ ఎస్బీఐ ఖాతా నుండి అమౌంట్ కట్ అయిందా? అందుకు కారణం ఏంటంటే..!
SBI కారణం ఇది..
ఎస్బీఐ SBI క్లాసిక్, సిల్వర్, గ్లోబల్ వంటి కార్డులకు సంబంధించిన వార్షిక రుసుము రూ. 200గా ఉంటుంది. ఈ మొత్తాన్ని ఎస్బీఐ వసూలు చేసిందన్నమాట. అయితే రూ. 236 ఎందుకు కట్ చేశారంటే ఈ ట్రాన్సాక్షన్పై Transaction 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తుంది. దీని ప్రకారం 18 శాతం అంటే రూ. 36 ట్యాక్స్ ఉంటుందన్నమాట. ఇలా మొత్తం రూ. 236 అకౌంట్ నుంచి కట్ అవుతున్నాయన్నమాట.
అయితే ఈ మెయింటెనెన్స్ ఛార్జీలు అనేవి మనం ఉపయోగించే కార్డ్ రకంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఖాతాలో సరిపడ అమౌంట్ లేకపోతే బ్యాలెన్స్ మైనస్ Minus అవుతుంది. ఇదిలా ఉంటే ఎస్బీఐ యూపీఐ పేమెంట్స్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రోజువారీ యూపీఐ లావాదేవీ పరిమితిని అమలు చేసింది. దీని ప్రకారం యూజర్లు రోజుకు గరిష్టంగా 10 లావాదేవీలు చేసుకోవచ్చు. గరిష్టంగా రూ. లక్ష వరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు.