WhatsApp introduce new feature for WhatsApp group
WhatsApp : ప్రస్తుతం ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. అందుకే వాట్సాప్ సంస్థ తమ వినియోగదారులను ఆకర్షించేలా కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్ టాప్ తో సహా దాని అన్ని వర్షన్ లలో కస్టమర్స్ ఇంటర్ఫేస్ గోప్యతను మెరుగుపరచడానికి వాట్సాప్ కొత్త అప్డేట్స్ తీసుకువస్తుందని నివేదికలు వెల్లడించాయి. రాబోయే అప్డేట్స్ లో కీబోర్డ్ కోసం కొత్త ఎమోజీలు, గ్రూప్ చాట్ అడ్మిన్ ల కోసం కొత్త ఆమోదం ఫీచర్లు ఉంటాయని తెలుస్తుంది. ఈ ఫీచర్ గ్రూప్ అడ్మిన్ లకు మరింత నియంత్రణను ఇస్తుంది.
WhatsApp introduce new feature for WhatsApp group
వాట్సాప్ తన ఆండ్రాయిడ్ బీటా వినియోగదారుల కోసం 21 కొత్త ఎమోజీలు పరీక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే అప్డేట్స్ లో ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా వాట్సాప్ కొత్త ఎమోజీలు తాజా అప్డేట్ లో భాగంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇంతకుముందు కొత్త ఎమోజీలు ఉన్న అధికారికంగా అదుబాటులో లేవు. అయితే ఇప్పుడు వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త ఎమోజీలను పరీక్షించి విడుదల చేస్తుంది. అలాగే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కోసం ప్రత్యేక ఫీచర్ ను ప్రవేశపెట్టింది.
గ్రూప్ ఇన్వైట్ లింక్ ద్వారా గ్రూప్ లో చేరగలిగే వ్యక్తుల సంఖ్యను నియంత్రించే అవకాశం తాజా అప్డేట్స్ తో గ్రూప్ అడ్మిన్ లకు లభించనుంది. సెట్టింగ్స్ నుంచి ప్రారంభించిన తర్వాత వాట్సాప్ యూజర్స్ గ్రూప్ చాట్ లో కొత్త వ్యక్తి గ్రూప్ లో చేరడానికి అడ్మిన్ నుంచి అనుమతి తీసుకునేలా సందేశం వస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. యూజర్స్ గ్రూప్ సెట్టింగ్లలో కొత్త గ్రూప్ సెట్టింగ్లను కనుగొంటారు. ఇక్కడ కొత్త పార్టిసిపెంట్లను ఆమోదించండి అని ఎంపిక కనబడుతుంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.