Bandi sanjay : తెలంగాణలో గత ఏడాది వరకు సీఎం కేసీఆర్ ను విమర్శించే దమ్ము, దైర్యం కలిగిన నేతగా ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కనిపించేవాడు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ తెలంగాణ బీజేపీ పగ్గాలు తీసుకున్నాడో, అప్పటి నుండి రేవంత్ రెడ్డి వెనుకబడిపోయాడు. ఈటెల లాంటి మాటలతో కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాడు. తాజాగా జరిగిన బైంసా అల్లర్ల గురించి బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ ను ప్రగతి భవన్ లో గల్లా పట్టుకుంటా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గానికే కొమ్ము కాసేలా వ్యవహరిస్తూ హిందువులని హింసిస్తుందని అన్నారు. బైంసాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ ప్రభుత్వం పోలీసులను ఎంఐఎం చెప్పు చేతల్లో పెట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని గవర్నర్కు ఫిర్యాదు చేశామని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
మహారాష్ట్ర నుండి బహిష్కరించిన కొందరు లుచ్చాలు బైంసాలో అల్లర్లు సృష్టిస్తున్నారని అన్నారు. పొడిచింది హిందువులనే అని, ఆస్తుల ధ్వంసం అయ్యింది హిందువులవే అని, అరెస్ట్ చేసింది హిందువులనే అని ఒక వైపు ప్రభుత్వం, మరోవైపు దుర్మార్గులు కలిసి హిందు కుటుంబాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక పసిపాప మీద అత్యాచారం జరిగితే సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదని అన్నారు. త్వరలోనే ప్రగతిభవన్లోకి చొరబడి సీఎం గల్లా పట్టుకొని ప్రశ్నిస్తామని బండి సంజయ్ అన్నారు.
అయితే బండి సంజయ్ కేసీఆర్ మీద ఎంతటి విమర్శలు చేసిన కానీ తెరాస నేతలు మాత్రం మౌనంగా ఉంటున్నారు తప్పితే, తిరిగి ఒక్క మాట కూడా బండి సంజయ్ ను అనటం లేదు. కావాలనే బండి సంజయ్ విషయంలో తెరాస నేతలు సైలెంట్ అయినట్లు తెలుస్తుంది. బండి సంజయ్ తో మాటకు మాట దిగితే అనవసరంగా బీజేపీకి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని భావించి, బండి సంజయ్ మీద తెరాస ద్వితీయ శ్రేణి నేత కూడా మాట్లాడటం లేదు. అయితే ఇదే ఊపులో సంజయ్ మాత్రం దూసుకొని వెళ్తూ, కేసీఆర్ ను ఇరుగున పెట్టె వ్యాఖ్యలు చేస్తున్నాడు..
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.