
BRS leaders : వరుసగా కాంగ్రెస్ లోకి చేరుతున్న బీఆర్ఎస్ నేతలు .. కారు ఖాళీ అయినట్లేనా ..!
BRS leaders : అధికారం అనే అయస్కాంతానికి ఆకర్షితులయ్యేవారు అధికారం పోగానే దూరమవుతారు. బీఆర్ఎస్ పార్టీకి ఈ విషయం వెంటనే తెలిసి వస్తుంది. తాము ప్రయోజించిన అధికారయస్కాంతం ఇప్పుడు రివర్స్ అవుతుంది. నిర్మల్ మున్సిపల్ బీఆర్ఎస్ అభ్యర్థులంతా ముకుమ్మడిగా కాంగ్రెస్ లోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర చోట్ల కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ లోకి అందరూ ఫిరాయింపులపై వచ్చినవారే. ముఖ్యంగా తిరుగులేని అధికారం ఉంటుందని, ఎంతో కొంత వెనక వేసుకోవచ్చు అని, అంతా పార్టీలో చేరిన వారే. ఇప్పుడు అధికారం పోవడంతో వారంతా పార్టీని నమ్ముకుని ఉండడం కష్టంగా మారింది. బీఆర్ఎస్ నుంచి భారీ ఎత్తున నేతలు కాంగ్రెస్ లోకి వెళుతున్నారు.
గ్రామస్థాయి నుండి ఎమ్మెల్యే ల వరకు ఈ వలస ఉండే అవకాశం ఉందని కనిపిస్తుంది. అధికారం నుంచి ప్రతిపక్ష పాత్రకు చేరి బీఆర్ఎస్ తమ క్యాడర్లను కాపాడుకోవడం అసలైన సమస్యగా మారింది. ఇప్పటికే మునిసిపాలిటీల్లో వలస ప్రభావం కనిపిస్తుంది. పదవి కాలం ఏడాది కూడా లేకపోయినా కాంగ్రెస్ లోకి చేరి ఆ పదవులను కాపాడుకోవడమో లేదా కొత్తగా పొందడమో ఆలోచన చేస్తున్నారు. దీనికి కారణం ప్రభుత్వం మారడం అని తెలుస్తుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ రాజకీయం పునరేకికరణ పేరుతో నేతలను పార్టీలోకి చేర్చుకున్నారు. వారు పార్టీకి అవసరమా కాదా అన్నది చూసుకోలేదు. ఇతర పార్టీలకు నేతలు ఉండకూడదని, తెలంగాణలో మరో పార్టీ గెలవదని నమ్మడం, దీంతో గ్రామస్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు కారు ఓవర్ లోడ్ అయిపోయింది. కానీ ఇప్పుడు అది రివర్స్ అయిపోయింది.బీఆర్ఎస్ లోకి చేరిన వారంతా కాంగ్రెస్ పార్టీ క్యాడర్స్ బీఆర్ఎస్ నేతల ఆఫర్ల వలన అందులోకి చేరారు. అధికారంలో ఉన్న పార్టీలోకి వస్తే పదవులు వస్తాయని అనుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జనవరి నుంచి గ్రామ పరిషత్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రామపంచాయతీ ఎన్నికలు రెండుసార్లు నిర్వహించారు. గ్రామాల్లో పట్టు కావాలంటే అధికార పార్టీలోకి చేరాలనే సాకుతో టిఆర్ఎస్లోకి వరుసగా చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంల్లోకి రావడంతో ఈ వలస కొనసాగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కానుంది.
ఇప్పుడు రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు లేవు. అందరూ ఆర్థిక ప్రయోజనం కోసమే చూస్తున్నారు. అందుకే కేసిఆర్ తమ పార్టీలోకి నేతలను ఆకర్షించుకున్నారు. కానీ ఇప్పుడు అదే రివర్స్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి వలసల ముప్పును ఆపడం కష్టం. పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయ నేతలు కొందరు ఎప్పుడూ అధికారం పార్టీలో ఉంటారు. వారికి ఏ పార్టీ అన్నది ముఖ్యం కాదు. అందుకే అధికారం పార్టీలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ అలాంటి వారి వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో అధికార పార్టీ తెలుసుకోవాల్సి ఉంటుంది.
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'నెయ్యి' రాజకీయం ముదిరి పాకాన పడింది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం…
PhonePe : డిజిటల్ పేమెంట్స్ రంగంలో ముందంజలో ఉన్న PhonePe మరో వినూత్న ఫీచర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ను…
Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జనసేన పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా…
KCR Big decision : తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో వేడెక్కుతుంటాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, నిన్నటి మున్సిపల్…
Naa Anveshana Anvesh: సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మన 'నా అన్వేషణ' అన్వేష్కు మెటా కంపెనీ గట్టి…
Aadhaar Card : నేటి డిజిటల్ యుగంలో ఆధార్ కార్డు ప్రతి భారతీయుడి జీవితంలో కీలక పత్రంగా మారింది. పిల్లల…
Success Story of Bihar Farmer వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నారు నేటి తరం రైతులు. సంప్రదాయ…
Revanth Reddy : తెలంగాణలో Telangana రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం Congress government మరో సంచలన నిర్ణయానికి…
Husband Wife : ఏపీలోని గుంటూరు జిల్లాలో అత్యంత విషాదకరమైన, విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. కేవలం టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు…
Rana Daggubati : దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి: ది బిగినింగ్ మరియు బాహుబలి 2: ది కన్క్లూజన్…
YouTuber Na Anvesh : యూట్యూబర్ నా అన్వేష్ కు instagram ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ Meta Platforms షాక్ ఇచ్చింది.…
Gold and Silver Rates Today 2026 Feb 20 : దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ…
This website uses cookies.