Kaleshwaram CAG Report : అసెంబ్లీలో కాక రేపుతున్న కాగ్ రిపోర్ట్...!
Kaleshwaram CAG Report : అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ కాక రేపుతోంది. ప్రాణహిత ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదని నివేదిక తెలిపింది. ఇక దీనికోసం కేటాయించిన వ్యయం లో 878 కోట్లు వృధా అయ్యాయని రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. రీ ఇంజనీరింగ్ పేరుతో నిధులను దుర్వినియోగం చేశారని కాగ్ పేర్కొంది. ప్రాణహిత మీద 2022 నాటికి 1722 కోట్లు ఖర్చు చేశారని అలాగే కాలేశ్వరంపై 86,788 కోట్లు వ్యయం అయిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.
కాలేశ్వరం ప్రాజెక్ట్ పై అంతర్రాష్ట్ర సమస్యలు నిల్వ సామర్థ్యం , సౌకర్యంపై సరైన అధ్యయనం చేయలేదని కాగ్ పేర్కొంది. అస్తవ్యస్తంగా కాలేశ్వరం పనులను ప్రారంభించారని తెలియజేసింది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ముప్పు సమస్యను కాగు ప్రస్తావించింది. ప్రాజెక్టు వ్యయం 122% పెరిగినప్పటికీటికీ ఆయకట్టు 52% మాత్రమే పెరిగిందని పేర్కొంది. కాలేశ్వరం ప్రాజెక్టు వడ్డీతో సహా కోటి 47,427 లక్షలు పెరిగిందని నివేదికలో కాగ్ పేర్కొంది. ప్రాణహిత ప్రాజెక్టు డిపిఆర్ కూడా లేదని చెప్పింది. పలు రకాల మార్పుల కారణంగా పనులు కూడా వృధా అయినట్లుగా తెలియజేసింది. దీంతో 767 కోట్ల నష్టం జరిగిందని కాగ్ నివేదికలో పేర్కొంది.
అలాగే కాలేశ్వరం డిపిఆర్ తయారుచేసిన వ్యాప్ కోస్ పని తీరుపై లోపాలు ఉన్నాయని కాగ్ స్పష్టం చేసింది. రీ ఇంజనీరింగ్ పనులు కూడా అదే సంస్థకు అప్పగించారని తెలియజేసింది. 2018లో కాలేశ్వరం డిపిఆర్ ను కేంద్ర జల సంఘం ఆమోదించక ముందే 17 రకాల పనులను 2549 కోట్లకు అప్పగించారని కాగ్ కుండబద్దలు కొట్టింది. డిపిఆర్ విడుదల చేసిన తర్వాత కూడా పనులలో మార్పులు చేశారని కాగ్ పేర్కొంది. ఈ క్రమంలోనే ముందుగా రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించిన ఆ తర్వాత అవసరం లేకపోయిన కూడా మూడు టీఎంసీలకు ప్రతిపాదన పెంచారని స్పష్టం చేసింది. దీంతో 28,151 కోట్లు అదనపు భారం పడిందని కాగ్ స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం కాగు నివేదిక అసెంబ్లీలో తీవ్ర దుమారం లేపుతుంది అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం అసెంబ్లీలో దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో…
Hindu Deities : ప్రయత్నాలు చేసినా కూడా గ్రహదోషాలు మాత్రం మన వెంట వస్తూనే ఉంటాయి. జన్మతః వరకు ఉంటాయి.…
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
This website uses cookies.