
Kaleshwaram CAG Report : అసెంబ్లీలో కాక రేపుతున్న కాగ్ రిపోర్ట్...!
Kaleshwaram CAG Report : అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ కాక రేపుతోంది. ప్రాణహిత ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదని నివేదిక తెలిపింది. ఇక దీనికోసం కేటాయించిన వ్యయం లో 878 కోట్లు వృధా అయ్యాయని రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. రీ ఇంజనీరింగ్ పేరుతో నిధులను దుర్వినియోగం చేశారని కాగ్ పేర్కొంది. ప్రాణహిత మీద 2022 నాటికి 1722 కోట్లు ఖర్చు చేశారని అలాగే కాలేశ్వరంపై 86,788 కోట్లు వ్యయం అయిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.
కాలేశ్వరం ప్రాజెక్ట్ పై అంతర్రాష్ట్ర సమస్యలు నిల్వ సామర్థ్యం , సౌకర్యంపై సరైన అధ్యయనం చేయలేదని కాగ్ పేర్కొంది. అస్తవ్యస్తంగా కాలేశ్వరం పనులను ప్రారంభించారని తెలియజేసింది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ముప్పు సమస్యను కాగు ప్రస్తావించింది. ప్రాజెక్టు వ్యయం 122% పెరిగినప్పటికీటికీ ఆయకట్టు 52% మాత్రమే పెరిగిందని పేర్కొంది. కాలేశ్వరం ప్రాజెక్టు వడ్డీతో సహా కోటి 47,427 లక్షలు పెరిగిందని నివేదికలో కాగ్ పేర్కొంది. ప్రాణహిత ప్రాజెక్టు డిపిఆర్ కూడా లేదని చెప్పింది. పలు రకాల మార్పుల కారణంగా పనులు కూడా వృధా అయినట్లుగా తెలియజేసింది. దీంతో 767 కోట్ల నష్టం జరిగిందని కాగ్ నివేదికలో పేర్కొంది.
అలాగే కాలేశ్వరం డిపిఆర్ తయారుచేసిన వ్యాప్ కోస్ పని తీరుపై లోపాలు ఉన్నాయని కాగ్ స్పష్టం చేసింది. రీ ఇంజనీరింగ్ పనులు కూడా అదే సంస్థకు అప్పగించారని తెలియజేసింది. 2018లో కాలేశ్వరం డిపిఆర్ ను కేంద్ర జల సంఘం ఆమోదించక ముందే 17 రకాల పనులను 2549 కోట్లకు అప్పగించారని కాగ్ కుండబద్దలు కొట్టింది. డిపిఆర్ విడుదల చేసిన తర్వాత కూడా పనులలో మార్పులు చేశారని కాగ్ పేర్కొంది. ఈ క్రమంలోనే ముందుగా రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించిన ఆ తర్వాత అవసరం లేకపోయిన కూడా మూడు టీఎంసీలకు ప్రతిపాదన పెంచారని స్పష్టం చేసింది. దీంతో 28,151 కోట్లు అదనపు భారం పడిందని కాగ్ స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం కాగు నివేదిక అసెంబ్లీలో తీవ్ర దుమారం లేపుతుంది అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం అసెంబ్లీలో దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
Donald Trump : అమెరికా United States of America అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన ఆర్థిక విధానాలకు ఆ…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి కారణం ఆయన కొత్త సినిమా కాదు…
Raghurama Krishnam Raju : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన శైలిలో ప్రకంపనలు సృష్టించే ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'నెయ్యి' రాజకీయం ముదిరి పాకాన పడింది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం…
PhonePe : డిజిటల్ పేమెంట్స్ రంగంలో ముందంజలో ఉన్న PhonePe మరో వినూత్న ఫీచర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ను…
Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జనసేన పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా…
KCR Big decision : తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో వేడెక్కుతుంటాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, నిన్నటి మున్సిపల్…
Naa Anveshana : సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మన 'నా అన్వేషణ' అన్వేష్కు మెటా కంపెనీ గట్టి…
Aadhaar Card : నేటి డిజిటల్ యుగంలో ఆధార్ కార్డు ప్రతి భారతీయుడి జీవితంలో కీలక పత్రంగా మారింది. పిల్లల…
Success Story of Bihar Farmer వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నారు నేటి తరం రైతులు. సంప్రదాయ…
Revanth Reddy : తెలంగాణలో Telangana రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం Congress government మరో సంచలన నిర్ణయానికి…
Husband Wife : ఏపీలోని గుంటూరు జిల్లాలో అత్యంత విషాదకరమైన, విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. కేవలం టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు…
This website uses cookies.