HCA భూములు ఎవ్వరు కొనొద్దు.. నష్టపోవద్దు - కేటీఆర్
HCA : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) కంచ గచ్చిబౌలి భూములపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరపాటున కూడా ఆ భూములను ఎవరు కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. మూడేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు ఆ భూములను తిరిగి తీసుకుని, హైదరాబాద్ ప్రజలు, హెచ్సీయూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) విద్యార్థులకు అతిపెద్ద ఎకో పార్క్గా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు ఈ భూములను విక్రయించాలని చూస్తోందని ఆరోపించారు.
HCA భూములు ఎవ్వరు కొనొద్దు.. నష్టపోవద్దు – కేటీఆర్
కేటీఆర్ తెలిపిన ప్రకారం.. 400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ఎకో పార్క్ హైదరాబాద్ ప్రజలకు మరియు యూనివర్సిటీ విద్యార్థులకు ఓ గొప్ప గిఫ్ట్ అవుతుందని ,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం రియల్ ఎస్టేట్ అభివృద్ధికి మొగ్గు చూపుతుంటే, బీఆర్ఎస్ మాత్రం భవిష్యత్ తరాల భద్రత కోసం ఆలోచిస్తోందని స్పష్టం చేశారు. ఇప్పుడే ఈ భూములను కొనుగోలు చేసే వారు తర్వాత పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని, ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని కేటీఆర్ స్పష్టంగా ప్రకటించారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అభివృద్ధితోనే కాదు, పర్యావరణ పరిరక్షణ కూ ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో వాయు కాలుష్య ప్రభావం ఎంతగా ఉందో, అదే పరిస్థితి హైదరాబాద్లో ఉండకూడదని ఆయన తెలిపారు. కంచ గచ్చిబౌలి భూములను రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు కాదని, భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎకో పార్క్గా అభివృద్ధి చేస్తామని స్పష్టంగా చెప్పారు. ఈ భూముల కోసం బీఆర్ఎస్ కోర్టులో పోరాడిందని, చివరకు ఈ భూములు ప్రజలకు తిరిగి వచ్చినట్లు తెలిపారు.
Ashada Masam : హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఆషాడ మాసానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఇది ఒక…
Health Tips : ఎంతో పవిత్రంగా భావించే ఈ మొక్క ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఔషధ ఘనీ అని…
Kannappa Movie Review : తెలుగు చిత్ర పరిశ్రమలో Kannappa Review పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ,…
kannappa Movie : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా రేపు గ్రాండ్గా విడుదల కానుంది.…
Ram charan : గ్లోబల్ స్టార్ రామ్చరణ్ కుడి చేయికి గాయం అయినట్లు వార్తలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం హైదరాబాద్లోని శిల్పకళా…
Subhanshu Shukla : భారత అంతరిక్ష చరిత్రలో మరొక సువర్ణాధ్యాయం లిఖితమైంది. యాక్సియం-4 (Axiom-4) మిషన్లో భాగంగా భారతీయుడు శుభాంశు…
Father : ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన…
Daughter : హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో…
This website uses cookies.