Farmer : రైతులకు గుడ్‌న్యూస్‌.. అకౌంట్‌లో 90,000..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Farmer : రైతులకు గుడ్‌న్యూస్‌.. అకౌంట్‌లో 90,000..!

 Authored By ramu | The Telugu News | Updated on :24 June 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Farmer : రైతులకు గుడ్‌న్యూస్‌.. అకౌంట్‌లో 90,000..!

  •  వారం రోజుల్లో రైతుల కోసం రూ.7 ,700 కోట్లు ఖర్చు పెట్టిన రేవంత్ సర్కార్

  •  Farmer : రైతులకు గుడ్‌న్యూస్‌.. అకౌంట్‌లో 90,000..!

Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా వానాకాలం సాగు ప్రారంభమైన ఈ సమయంలో “రైతు భరోసా” పథకం కింద నిధులను శరవేగంగా జమ చేస్తోంది. జూన్ 16న సీఎం రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని రైతు భరోసా నిధుల విడుదలకు బటన్ నొక్కారు. కేవలం ఆరు రోజుల్లోనే రూ.7,700 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Farmer రైతులకు గుడ్‌న్యూస్‌ అకౌంట్‌లో 90000

Farmer : రైతులకు గుడ్‌న్యూస్‌.. అకౌంట్‌లో 90,000..!

Farmer : వామ్మో వారం రోజుల్లో “రైతు భరోసా” కింద రూ.7 ,700 కోట్లు జమ చేసిన తెలంగాణ సర్కార్

ఈ పథకం కింద ప్రతి ఎకరాకు రూ.6,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా జూన్ 23న 15 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో రూ.90,000 వరకు జమ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ తాజాగా రూ.513 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇప్పటి వరకు మొత్తం రూ.8,284 కోట్లను రాష్ట్రవ్యాప్తంగా 67.01 లక్షల మంది రైతులకు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

జూన్ 24తో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఈ సందర్భంగా రైతుల్లో ఉత్సాహం నింపేందుకు అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యేకంగా “రైతు భరోసా సంబరాలు” నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు కోటి 39 లక్షల ఎకరాలకు పైగా భూములకు రైతు భరోసా సాయం అందిందని, ఇది దేశంలోనే అరుదైన ఘనత అని ఆయన అన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది