New pensions : లబ్ధిదారులకు శుభవార్త .. ఆగస్టు 15 నుంచి 2.25 లక్షల మందికి కొత్త పింఛన్లు.. ఎవరికెవరికీ వస్తాయంటే?
New pensions : తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి కొత్త ‘చేయూత’ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ప్రారంభించనుంది. తొలి దశలో 2,25,599 మంది అర్హులకు పింఛన్లు మంజూరు. అర్హుల ఎంపిక, కొత్త వర్గాల చేర్పుపై పూర్తి వివరాలు తెలుసుకోండి.
New pensions : తెలంగాణలో కొత్త సామాజిక భద్రత పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘చేయూత’ సామాజిక భద్రత పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల పంపిణీని 2026 ఆగస్టు 15 నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తొలి విడతలో 2,25,599 మంది అర్హులకు పింఛన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనుండగా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇన్చార్జి మంత్రులు లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేయనున్నారు. కార్యక్రమం ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు ఇప్పటికే సమగ్ర కార్యాచరణను సిద్ధం చేశాయి. జిల్లాల వారీగా అధికారులు కూడా ఏర్పాట్లను వేగవంతం చేశారు.
New pensions : లబ్ధిదారులకు శుభవార్త .. ఆగస్టు 15 నుంచి 2.25 లక్షల మందికి కొత్త పింఛన్లు.. ఎవరికెవరికీ వస్తాయంటే?
New pensions : తొలి దశలో 2.25 లక్షల మందికి పింఛన్లు.. కొత్త వర్గాలకు కూడా అవకాశం
ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 2,25,599 మంది కొత్త అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు కానున్నాయి. సమాజంలోని బలహీన వర్గాలకు మరింత ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, బీడీ ఠేకేదార్లు, హెచ్ఐవీ-ఏఆర్టీ బాధితులు, ఫైలేరియా రోగులు, డయాలసిస్ పేషెంట్లు సామాజిక భద్రత పింఛన్లను పొందుతున్నారు. వీరితో పాటు తలసీమియా మరియు సికిల్ సెల్ అనీమియా బాధితులను కూడా పింఛన్ పథకంలో చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్తగా మరిన్ని వర్గాల ప్రజలకు ఈ పథకం ప్రయోజనం అందే అవకాశం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పటివరకు 1,23,625 మంది కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 82,625 మంది వృద్ధాప్య పింఛన్, 19,044 మంది వితంతు పింఛన్, 13,830 మంది హెచ్ఐవీ-ఏఆర్టీ బాధితులు, 6,996 మంది డయాలసిస్ రోగులు, 982 మంది దివ్యాంగులు ఉన్నారు.
New pensions : అర్హుల గుర్తింపులో వేగం.. సర్వే ఆధారంగా ఎంపిక
తాజా ఆదేశాల నేపథ్యంలో అర్హుల గుర్తింపు ప్రక్రియను అధికారులు మరింత వేగవంతం చేశారు. ఇటీవల నిర్వహించిన కుల గణన (సీపెక్ సర్వే) ద్వారా సేకరించిన వివరాలతో పాటు స్వయం సహాయక మహిళా సంఘాలు (SHGs) అందించిన సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్నారు. ఈ మొత్తం ప్రక్రియను సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి కేటగిరీలో అర్హతలను క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే ఈ కొత్త పింఛన్ల పంపిణీతో లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది. సామాజిక భద్రతను మరింత విస్తరించడంతో పాటు అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.






