School : స్కూల్ టైమింగ్స్ మార్చేసిన తెలంగాణా ప్రభుత్వం.. ఇక మీదట ఈ టైమింగ్స్ ఫాలో అవ్వాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

School : స్కూల్ టైమింగ్స్ మార్చేసిన తెలంగాణా ప్రభుత్వం.. ఇక మీదట ఈ టైమింగ్స్ ఫాలో అవ్వాల్సిందే..!

School : తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త విధానాలను ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే వారు ఇచ్చిన హామీల ప్రకారంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు చేయగా రైతుల రుణాల మీద రీసెంట్ గా రుణమాఫీ చేసింది. తెలంగాణాని అభివృద్ధి చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన సాగిస్తుంది.ఇక రాష్ట్రం బాగుండాలి అంటే విద్యార్ధులు బాగుండాలి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థను కూడా పటిష్టంగా చేసేందుకు కృషి చేస్తుంది. ఈ క్రమంలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 July 2024,8:00 pm

School : తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త విధానాలను ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే వారు ఇచ్చిన హామీల ప్రకారంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు చేయగా రైతుల రుణాల మీద రీసెంట్ గా రుణమాఫీ చేసింది. తెలంగాణాని అభివృద్ధి చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన సాగిస్తుంది.ఇక రాష్ట్రం బాగుండాలి అంటే విద్యార్ధులు బాగుండాలి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థను కూడా పటిష్టంగా చేసేందుకు కృషి చేస్తుంది. ఈ క్రమంలో కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ పాఠశాల విధి విధానాలు.. మార్చాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో టైమింగ్స్ ని మార్చినట్టు తెలుస్తుంది.

School పనివేళల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ..

ప్రభుత్వ పాఠశాలల పనివేళల్లో స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాల పనివేళలో మార్పులు చేసింది. ప్రభుత్వ ఉన్నంత పాఠశాలను ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు ఉండేది. ఆ టైమింగ్స్ ని మార్చి ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు టైమింగ్స్ మార్చింది.

School స్కూల్ టైమింగ్స్ మార్చేసిన తెలంగాణా ప్రభుత్వం ఇక మీదట ఈ టైమింగ్స్ ఫాలో అవ్వాల్సిందే

School : స్కూల్ టైమింగ్స్ మార్చేసిన తెలంగాణా ప్రభుత్వం.. ఇక మీదట ఈ టైమింగ్స్ ఫాలో అవ్వాల్సిందే..!

ప్రాధమికోన్నత పాఠశాల టైమింగ్స్ మాత్రం యథావిధంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు కొనసాగుతాయి. హైదరాబా, సికిందరాబాద్ నగరాల్లో మాత్రం ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠాశాలలు నిర్వహిస్తారు. ప్లే స్కూల్ లానే అంగన్వాడీలను తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు అక్కడే 3వ తరగతి వరకు భోధన చేసేలా ఒక టీచర్ ని కూడా నియమించేలా విధి విధానాలను ఆలోచిస్తున్నారు. ఈ స్కూల్ టైమింగ్స్ కేవలం ప్రభుత్వ పాఠశాలకేనా ప్రైవేట్ స్కూల్స్ కి కూడా కచ్చితంగా పాటించేలా చేస్తారా అన్నది చూడాలి. తెలంగాణాలో స్కూల్ టైమింగ్స్ మార్చడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది