Telangana New Pension : బ్రేకింగ్‌.. తెలంగాణలో భారీ శుభవార్త.. ఆగస్టు 15 నుంచే కొత్త పింఛన్లు..!

Authored By Sudheer Ramanujam | The Telugu News | Updated on : 31 July 2026, 1:33 pm
  •  Telangana New Pension : Telangana Pension , తెలంగాణలో ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ల పంపిణీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తలసేమియా, సికిల్ సెల్ బాధితులు, ఒంటరి మహిళలు, వితంతువులు, నేత, గీత కార్మికులతో పాటు ఇతర అర్హులకు పింఛన్లు అందనున్నాయి. ఇందిరమ్మ చీరలు, తాగునీటి సరఫరా, గ్రామాభివృద్ధిపై కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు

Telangana New Pension : తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాల అమలులో మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త పింఛన్ల పంపిణీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చేయూత పథకం కింద వివిధ వర్గాలకు ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో కలిసి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పలు అంశాలపై సీఎం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

Telangana New Pension : బ్రేకింగ్‌.. తెలంగాణలో భారీ శుభవార్త.. ఆగస్టు 15 నుంచే కొత్త పింఛన్లు..!

Telangana New Pension : బ్రేకింగ్‌.. తెలంగాణలో భారీ శుభవార్త.. ఆగస్టు 15 నుంచే కొత్త పింఛన్లు..!

Telangana New Pension ఆగస్టు 15 నుంచే కొత్త పింఛన్ల పంపిణీ.. ఏ వర్గాలకు వర్తిస్తుంది?

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా ఇప్పటివరకు పింఛన్లకు దూరంగా ఉన్న అర్హులైన వర్గాలను గుర్తించి వెంటనే జాబితాలో చేర్చాలని అధికారులకు సూచించారు. ఈ నిర్ణయం ప్రకారం తలసేమియా మరియు సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు కూడా మొదటిసారిగా పింఛన్లు మంజూరు చేయనున్నారు. అలాగే ఒంటరి మహిళలు, వితంతువులు, నేత కార్మికులు, గీత కార్మికులు వంటి వర్గాలకు అర్హతల మేరకు పింఛన్లు అందించాలని సీఎం స్పష్టం చేశారు.దివ్యాంగుల కుటుంబాల పట్ల కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఒకవేళ దివ్యాంగుడు మరణిస్తే, ఆయన భార్య అర్హురాలైతే ఆలస్యం చేయకుండా వెంటనే పింఛన్ మంజూరు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరిని వేగంగా గుర్తించి, పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు.పేదలు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న రేవంత్ రెడ్డి, పింఛన్ పథకాలు నిజమైన అర్హులకు చేరేలా పారదర్శకంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ చీరలు, తాగునీరు, గ్రామాభివృద్ధిపై కూడా కీలక నిర్ణయాలు

సమీక్ష సమావేశంలో పింఛన్లతో పాటు మహిళలకు పంపిణీ చేసే ఇందిరమ్మ చీరల అంశంపైనా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. చీరలు నాణ్యతతో పాటు ఆకర్షణీయమైన డిజైన్లలో ఉండాలని సూచించారు. ఇందుకోసం నిఫ్ట్ (NIFT) విద్యార్థుల డిజైన్ నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. ఎల్ నినో ప్రభావం కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా పథకాల నిర్వహణలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.మండల స్థాయి అభివృద్ధి పనులను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఎంపీడీవోలు ప్రతి 45 రోజులకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని, వాటికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో తారు రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, జనాభా ఆధారంగా పంచాయతీ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఇక వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. రైతులు పండించే పంటలకు మార్కెట్‌లో ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం కొనుగోలు చర్యలు చేపట్టాలని కూడా అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలపై సమగ్రంగా దృష్టి సారిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఈ సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ కొత్త పింఛన్లు , సీఎం రేవంత్ రెడ్డి , చేయూత పథకం , ఆగస్టు 15 పింఛన్లు , తెలంగాణ ప్రభుత్వం తాజా వార్తలు , Telangana New Pensions , Revanth Reddy , Cheyutha Scheme Telangana ,Telangana Pension Scheme 2026 ,Telangana Government News

Advertisement

Sudheer Ramanujam

Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి