AISF : పహల్గాంలోని పర్యాటకులను హతమార్చిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AISF : పహల్గాంలోని పర్యాటకులను హతమార్చిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి

 Authored By ramu | The Telugu News | Updated on :24 April 2025,11:00 pm

ప్రధానాంశాలు:

  •  AISF : పహల్గాంలోని పర్యాటకులను హతమార్చిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి

AISF  : గురువారం నాడు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పహాల్గమ్ ఘటనలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ, వారి మరణానికి కారణమయిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, ఉగ్రవాదుల దిష్టిబొమ్మని హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ…

AISF పహల్గాంలోని పర్యాటకులను హతమార్చిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి

AISF : పహల్గాంలోని పర్యాటకులను హతమార్చిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి

AISF  ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం

జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో  Kashmir Pahalgam ఉగ్రదాడిని ఖండించారు. ఈ ఈ ఘటన అత్యంత విషాదకరమనీ,ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటే, ఉగ్ర మూకలను కఠినంగా శిక్షించాలన్నారు. దేశ సమగ్రతను సమైక్యతను పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం మరియు కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. ఉగ్ర మూకాలు కాశ్మీర్ ప్రాంతంలో ఎక్కడ దాగి ఉన్న వెంటాడి శిక్షించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉగ్రవాదులకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పాలని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సమన్వయంతో ఉగ్రవాదులను ఏరివేత చేపట్టాలని, భవిష్యత్తులో దేశంలో ఎక్కడ ఉగ్ర దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు.

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు దేశ యువత నడుము బిగించాలన్నారు. మరణించిన కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గ్యార క్రాంతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్యార నరేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సామిడి వంశీవర్ధన్ రెడ్డి, ఎండి అన్వర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు చైతన్య యాదవ్, రాష్ట్ర నాయకులు అరుణ్, హరీష్, జ్ఞానేశ్వర్, అశ్విన్, వెంకటేష్, ఉదయ్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది