KCR : 50 నిమిషాల పాటు కేసీఆర్ ను కమిషన్ చైర్మన్ అడిగిన ప్రశ్నలు ఏంటి ..?
ప్రధానాంశాలు:
KCR : 50 నిమిషాల పాటు కేసీఆర్ ను కమిషన్ చైర్మన్ అడిగిన ప్రశ్నలు ఏంటి ..?
KCR : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కమిషన్ ఎదుట హాజరయ్యారు. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో నడుస్తున్న కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్ను సుమారు 50 నిమిషాల పాటు ప్రశ్నించారు. ఈ విచారణలో ప్రాజెక్టుకు సంబంధించిన పలు కీలక అంశాలపై వివరాలు అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు పలు ఆధారాలను కూడా కమిషన్కు సమర్పించారు. కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు సాక్ష్యాధారాలతో సహా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం.

KCR : 50 నిమిషాల పాటు కేసీఆర్ ను కమిషన్ చైర్మన్ అడిగిన ప్రశ్నలు ఏంటి ..?
KCR కేసీఆర్ చెప్పిన సమాధానాలతో కాళేశ్వరం కమిషన్ చైర్మన్ నోటి వెంట మాట కూడా రాలేదు
ఇప్పటివరకు కాళేశ్వరం కమిషన్ విచారణలో 114 మందిని విచారించగా, కేసీఆర్ 115వ వ్యక్తిగా విచారణకు హాజరయ్యారు. జూలై చివరిలో కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ప్రాజెక్టు నిర్మాణం, పనితీరు, మౌలిక లోపాలు, వ్యయాలు వంటి అంశాలపై సంపూర్ణంగా వెలుగు చెయ్యనుంది. జస్టిస్ పీసీ ఘోష్ నాయకత్వంలోని కమిషన్ ఈ అంశాలపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపింది.
విచారణ అనంతరం కేసీఆర్ నేరుగా తన కారులో కూర్చొని పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. బీఆర్కే భవన్ నుంచి బయటకు వస్తూనే కేసీఆర్కు శ్రేణులు “జై కేసీఆర్, జై తెలంగాణ” నినాదాలతో స్వాగతం పలికారు. ఈ రోజు ఉదయం 9.30 గంటలకు ఎర్రవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన కేసీఆర్, 11 గంటలకు బీఆర్కే భవన్కి చేరుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు విచారణకు హాజరయ్యారు.