Revanth Reddy : రేవంత్ రెడ్డి జిల్లాలో నిరసన చేస్తున్న ఓటర్లు.. ఖాళీగా కనిపించిన పోలింగ్ బూత్
Revanth Reddy : ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో సందడి వాతావరవణం నెలకొంది. పోలింగ్ డే కావడంతో ఉదయం 7గంల నుండే ఓటర్లు పోలింగ్ బూత్కి చేరుకొని ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు, యువత, కొత్తగా ఓటు హక్కువచ్చిన వారు ఎక్కువ ఓట్లు వేసినట్టు తెలుస్తుంది. అయితే సాధారణంగా ఎక్కువ ఓట్లు పోల్ అయితే ఆ పోలింగ్ బూత్ల గురించి వార్తలలో చెబుతుంటారు కాని ఇప్పుడు తెలంగాణలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ జరగకుండా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే అదీ ఇదీ కాదు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని ఓ గిరిజన గ్రామం కావడం విశేషం.
పోలింగ్ సిబ్బందికి పనిలేకుండా గ్రామ ప్రజలు నిరసన తెలియజేస్తూ హాట్ టాపిక్గా మారారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచు గూడెంలో మూడు రోజులుగా కరెంటు లేకపోవడంతో గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం, మంచినీటి వసతి, రేషన్ కార్డులు లాంటి సమస్యలు కూడా ఉన్నాయని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు. నల్లమల ప్రాంతం కావడంతో పాములు వస్తున్నాయని, కరెంట్ లేకపోవడంతో పాము కాటుకు గురి కావాల్సివస్తోందని తెలిపారు. విద్యుత్ అధికారులు కరెంటు బిల్లులు అడుగుతారు కాని, కరెంటు మాత్రం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Revanth Reddy : రేవంత్ రెడ్డి జిల్లాలో నిరసన చేస్తున్న ఓటర్లు.. ఖాళీగా కనిపించిన పోలింగ్ బూత్
ఎన్నికల సీజన్ కావడంతో వారంతా ఒక్కతాటిపైకి వచ్చి ఓటు వేయకుండా గ్రామంలోనే బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించడంతో పోలింగ్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో విద్యుత్ సిబ్బంది హుటాహుటిన చెంచు గూడెంకు చేరుకున్నారు. సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్థులు మాత్రం బెట్టువీడలేదు. ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇస్తే కానీ ఓటు వేయడానికి రాలేమని తేల్చి చెబుతున్నారు. మొత్తానికి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచు గూడెం చెంచులు ఓట్లు వేయకుండా బహిష్కరించి ఆందోళన చేపట్టడం చర్చనీయాంశం అయింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.