YS Jagan : ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రోజురోజుకూ బాగా వేడెక్కుతోంది. దూషణల పర్వం నుంచి దాడుల వరకు రాజకీయం మారింది. ఈ క్రమంలోనే టీడీపీ అధికారి ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలతో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ దాడులను ఖండిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బంద్కు పిలుపునివ్వడంతో పాటు నిరసన దీక్ష చేస్తున్నాడు. కాగా, ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు.వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో లేదని, తమ నాయకుడు అధికారంలో లేడని చెప్పి ముఖ్యమంత్రిని ఉద్దేశించి బూతులు తిడుతున్నారని, ల.. కొడకా అని అంటున్నారని, అది కరెక్టెనా అని ఆలోచన చేయాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రిని దూషించడం ద్వారా రాష్ట్రంలో సీఎంను అభిమానించే వ్యక్తులు తిరగబడి, రెచ్చిపోయి మరి ప్రజల మధ్య భావోద్వేగాలు పెరిగి, గొడవలు పెరిగేలా ఆలోచనలు చేయడం సరియేనా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలని సీఎం జగన్ టీడీపీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరిట చంద్రబాబు 36 గంటల నిరసన దీక్షలో కూర్చొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిరసనలో పాల్గొన్న చంద్రబాబు ఏపీ ప్రభుత్వ తీరుపై పలు కామెంట్స్ చేశాడు. టీడీపీని తుదముట్టించాలనే వైసీపీ వారు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రజాస్వామ్య వాదులు అందరూ కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు త్వరలో రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ దాడులపై కేంద్రం దృష్టి సారించాలని ఇప్పటికే బీజేపీ మిత్రమపక్షమైన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఈ దాడుల సంస్కృతి సరికాదని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే అరాచకాలకు కేరాఫ్గా ఏపీ ఉండబోతుందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
This website uses cookies.