Brahmamudi March 2nd 2026 Episode : రాజు, నందులుగా కావ్య-రాజ్ రీ ఎంట్రీ.. బ్రహ్మముడిలో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brahmamudi March 2nd 2026 Episode : రాజు, నందులుగా కావ్య-రాజ్ రీ ఎంట్రీ.. బ్రహ్మముడిలో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్!

 Authored By jagadesh | The Telugu News | Updated on :2 March 2026,9:00 am

Brahmamudi March 2nd 2026 Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘బ్రహ్మముడి’ సీరియల్ ప్రేక్షకులను ఉత్కంఠభరితమైన మలుపులతో అలరిస్తోంది. సోమవారం మార్చి 2 ఎపిసోడ్ సీరియల్ చరిత్రలోనే ఒక పెద్ద మైలురాయిగా నిలిచిపోతుంది. కావ్య, రాజ్ మరణంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయిన అభిమానులకు మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. తరం మారిన కథలో Generation Leap కావ్య, రాజ్ పాత్రలు తిరిగి నందు, రాజు రూపంలోకి రావడం ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది. అసలు ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో వివరంగా చూద్దాం.

Brahmamudi March 2nd 2026 Episode రాజు నందులుగా కావ్య రాజ్ రీ ఎంట్రీ బ్రహ్మముడిలో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్

Brahmamudi March 2nd 2026 Episode : రాజు, నందులుగా కావ్య-రాజ్ రీ ఎంట్రీ.. బ్రహ్మముడిలో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్!

Brahmamudi March 2nd 2026 Episode రేఖ అహంకారం.. కాలి బూడిదైన దుగ్గిరాల జ్ఞాపకాలు

ఎపిసోడ్ ప్రారంభంలోనే రేఖ తన అహంకారాన్ని, క్రూరత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఇంటిని తన గుప్పెట్లోకి తెచ్చుకున్న రేఖ, దుగ్గిరాల కుటుంబ ఆనవాళ్లు లేకుండా చేయాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న దుగ్గిరాల ఫ్యామిలీ ఫోటోలన్నింటినీ నిర్దాక్షిణ్యంగా తగలబెట్టేస్తుంది. కళ్ల ముందే తన కుటుంబ జ్ఞాపకాలు కాలిపోతుంటే అపర్ణ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎంత వేడుకున్నా రేఖ కనికరించదు. రేఖ భర్త, అతని అక్క ఈ దుశ్చర్యను చూసి సంబరపడిపోతుంటారు. కానీ, రేఖ అక్క భర్త శేషు మాత్రం “ఇలా చేయడం మహా పాపం” అని వారిని వారిస్తాడు. అయినా వారు వినరు.

Brahmamudi March 2nd 2026 Episode గతం మర్చిపోయిన స్వరాజ్.. బస్తీ కుర్రాడు ‘రాజు’గా ఎంట్రీ

మరోవైపు, ప్రాణాపాయం నుంచి బయటపడిన చిన్నారి స్వరాజ్ తన గతాన్ని పూర్తిగా మర్చిపోతాడు. అతడిని కాపాడిన లక్ష్మి దంపతులు కంటికి రెప్పలా చూసుకుంటారు. పిల్లోడి తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నించినా ఫలితం ఉండదు. ఎన్ని రోజులైనా పోలీసుల వద్ద మిస్సింగ్ కేసు నమోదు కాకపోవడంతో, ఆ పిల్లాడి తల్లిదండ్రులు చనిపోయి ఉంటారని వారు భావిస్తారు. గతం మర్చిపోయిన ఆ పిల్లాడికి ‘రాజు’ అని పేరు పెట్టి, తమ పెద్ద కొడుకుగా పెంచుకుంటారు. స్వరాజ్ కూడా లక్ష్మి దంపతులనే తన అమ్మానాన్నలుగా భావిస్తూ, తన తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ పెరగడం ప్రారంభిస్తాడు.

చదువుకు దూరం చేయాలని రేఖ కుట్ర.. అపర్ణకు కావ్య ఆత్మ ధైర్యం

ఇంట్లో రేఖ తన అన్న కూతురు, తన భర్త అక్క పిల్లలకు ఘనంగా అక్షరాభ్యాసం చేయిస్తుంది. అది చూసిన అపర్ణ మనసు కకావికలం అవుతుంది. తన మనవరాళ్లు నందు, ఇందులకు కూడా అక్షరాభ్యాసం చేయించాలని వస్తుంది. కానీ, రేఖ ఆమెను దారుణంగా అవమానిస్తుంది. “వాళ్లు చదువుకోకూడదు, నేను చెప్పింది చేసుకుంటూ ఈ ఇంట్లో పని మనుషులుగా బతకాలి” అని వార్నింగ్ ఇస్తుంది.

దీంతో అపర్ణ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. కావ్యకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నానని కుమిలిపోతుంది. ఆ సమయంలో అపర్ణ మనసులోని ఆలోచనల నుంచి కావ్య ఆత్మ రూపంలో ప్రత్యక్షమవుతుంది. “ఒక దారి మూసుకుపోతే, మరో దారి ఉంటుంది అత్తయ్యా.. వాళ్లు వద్దంటే మీరు మానేస్తారా? మీరు ధైర్యంగా అడుగు ముందుకేయండి” అని కావ్య ఆత్మ అపర్ణకు మార్గనిర్దేశం చేస్తుంది.

నందు తిరుగుబాటు.. అపర్ణ అండ

కావ్య మాటలతో ధైర్యం తెచ్చుకున్న అపర్ణ, తన మనవరాళ్లకు తానే స్వయంగా అక్షరాలు నేర్పించాలని నిర్ణయించుకుంటుంది. ఇద్దరికీ పలకలు ఇచ్చి అక్షరాభ్యాసం చేయిస్తుంది. ఈ స్వార్థపూరిత ప్రపంచంతో ఎలా పోరాడాలో తానే గురువై నేర్పిస్తానని చెబుతుంది. ఇది గమనించిన రేఖ కోపంతో రగిలిపోతూ వచ్చి, పిల్లల చేతుల్లోని పలకలు లాక్కొని నేలకేసి కొట్టి పగలగొడుతుంది. ఆ సమయంలో చిన్నారి నందు ధైర్యంగా రేఖను ఎదిరిస్తుంది. “నువ్వు చెప్పింది వినం” అని తేల్చి చెబుతుంది. నందును కొట్టబోయిన రేఖను అపర్ణ అడ్డుకుంటుంది. దీంతో రేఖ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోగా, సుభాష్ వచ్చి పిల్లలకు, అపర్ణకు ధైర్యం చెబుతాడు.

అసలు కథ మొదలైంది.. నందు శపథం, మాస్ అవతార్‌లో రాజు

ఎపిసోడ్ చివర్లో సీరియల్ సరికొత్త మలుపు తిరుగుతుంది. కథలో కాలం ముందుకు వెళుతుంది. చిన్నపిల్లలుగా ఉన్న నందు, రాజు పెద్దవాళ్లవుతారు. చనిపోయిన కావ్య, రాజ్ మళ్లీ ఇప్పుడు నందు, రాజు రూపంలో ప్రేక్షకుల ముందుకు రావడం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.

పెద్దదైన నందు తన నాన్నమ్మ, తాతయ్యలకు ధైర్యం చెబుతూ.. “దుగ్గిరాల వంశపు వైభవాన్ని తిరిగి నిలబెడతాను” అని శపథం చేస్తుంది. అదే సమయంలో అపర్ణ “నీ అమ్మానాన్న బతికి ఉంటే ఈపాటికి నీ బావ స్వరాజ్‌తో నీ పెళ్లి జరిగేది” అని బాధపడుతుంది. కట్ చేస్తే.. బస్తీలో పెరిగిన రాజు పక్కా మాస్ అవతార్‌లో ఎంట్రీ ఇస్తాడు. వాటర్ ట్యాంక్ దగ్గర నీళ్ల కోసం బస్తీ ఆడవాళ్లతో గొడవ పడుతూ తన మార్క్ చూపిస్తాడు.

తరువాయి భాగంలో ఏ జరగనుందంటే?

బావ మరదళ్లు అయిన నందు, రాజు ఇప్పుడు పూర్తిగా భిన్నమైన వాతావరణాల్లో పెరుగుతున్నారు. కుటుంబ గౌరవం నిలబెట్టాలని నందు పోరాడుతుంటే, గతం మర్చిపోయిన రాజు బస్తీ కుర్రాడిగా బతుకుతున్నాడు. వీళ్ళిద్దరూ ఎలా కలవబోతున్నారు? దుగ్గిరాల ఫ్యామిలీకి పట్టిన రేఖ గ్రహణాన్ని నందు ఎలా వదిలించబోతోంది? అన్నది తదుపరి ఎపిసోడ్స్ లో అత్యంత ఆసక్తికరంగా మారనుంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది