Karthika Deepam 2 February 20th Today Episode Highlights : కార్తీక దీపం 2 ఫిబ్రవరి 20 ఎపిసోడ్: దశరథకు దిమ్మతిరిగే షాక్! దీపే అసలైన కూతురు.. జ్యోత్స్న డ్రామాకు ఎండ్ కార్డ్?
Karthika Deepam 2 February 20th Today Episode Highlights : బుల్లితెర మెగా సీరియల్ ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపుకు చేరుకుంది. ఇన్నాళ్లూ దాగుడు మూతలాడిన నిజం ఎట్టకేలకు దశరథ ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 20వ తేదీన ప్రసారమైన 599వ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Karthika Deepam 2 February 20th Today Episode Highlights : కార్తీక దీపం 2 ఫిబ్రవరి 20 ఎపిసోడ్: దశరథకు దిమ్మతిరిగే షాక్! దీపే అసలైన కూతురు.. జ్యోత్స్న డ్రామాకు ఎండ్ కార్డ్?
Karthika Deepam 2 February 20th Today Episode Highlights : జ్యోత్స్న బండారం బయటపెట్టిన కార్తీక్
ఎపిసోడ్ ప్రారంభంలో, దశరథ తన భార్య సుమిత్ర ఆరోగ్యం గురించి తల్లడిల్లిపోతుంటాడు. ఆపరేషన్ కోసం జ్యోత్స్న శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ కావడం లేదని అతను తీవ్ర ఆందోళన చెందుతుండగా, కార్తీక్ Karthik రంగ ప్రవేశం చేస్తాడు. “మామయ్యా.. జ్యోత్స్న శాంపిల్స్ ఎప్పటికీ మ్యాచ్ కావు, ఎందుకంటే తను నీ కన్నకూతురు కాదు” అంటూ బాంబు పేలుస్తాడు. ఈ మాట విన్న దశరథ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు.
Karthika Deepam 2 February 20th Today Episode Highlights : దీపే అసలైన వారసురాలు
కార్తీక్ మాటలను దశరథ నమ్మలేకపోతాడు. “నా కళ్ల ముందు పెరిగిన బిడ్డ నాది కాదంటే ఎలా?” అని ప్రశ్నిస్తాడు. అప్పుడు దాసు ఎంట్రీ ఇచ్చి, పారిజాతం చేసిన కుట్రను వివరించాడు. సుమిత్ర ప్రసవించిన సమయంలో బిడ్డలను మార్చిన ఘోరకలిని వివరిస్తూ, దీప Deepa నే నీ అసలైన కన్నకూతురు అని నిజం చెబుతాడు. గుడిలో దీపాలు వెలిగిస్తున్న దీపను చూపిస్తూ.. “జ్యోతుల మధ్య దీపంలా వెలిగిపోతున్న నీ కూతుర్ని చూడు మామయ్యా” అని కార్తీక్ చెప్పే సీన్ ప్రేక్షకులను ఎమోషనల్గా కదిలించింది.
తండ్రీకూతుళ్ల భావోద్వేగ కలయిక
ఇన్నాళ్లూ తన కళ్ల ముందే ఉన్న దీప తన కన్నబిడ్డ అని తెలియగానే దశరథ ఆనందం, ఆవేదన మధ్య కొట్టుమిట్టాడతాడు. దీప దగ్గరకు వెళ్లి “అమ్మా..” అని పిలవడంతో ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. కార్తీక్ జరిగిన నిజాన్ని దీపకు వివరించడంతో, తండ్రీకూతుళ్లు ఒకరినొకరు పట్టుకుని ఏడ్చిన దృశ్యం ఈ ఎపిసోడ్కే హైలైట్.
జ్యోత్స్న ప్లాన్ రివర్స్ – స్వప్న ఆగ్రహం
మరోవైపు, జ్యోత్స్న తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. తన తండ్రి దాసునే కిడ్నాప్ చేసిన విషయం బయటపడటంతో పారిజాతం కూడా జ్యోత్స్నను అసహ్యించుకుంటుంది. ఇంకోవైపు, శ్రీధర్ ఇంట్లో కాశీ డ్రైవర్గా చేరడాన్ని స్వప్న జీర్ణించుకోలేకపోతుంది. “డ్రైవర్తో కలిసి భోజనం చేయలేను” అంటూ ఆమె చేసిన రచ్చ కొత్త గొడవలకు దారితీసింది.
సుమిత్ర ప్రాణాలు కాపాడటానికి దీప తన కడుపులో ఉన్న బిడ్డను త్యాగం చేయడానికి సిద్ధపడుతున్న విషయం దశరథకు తెలిస్తే పరిస్థితి ఏంటి? తన అసలైన కూతుర్ని దశరథ ఎలా అక్కున చేర్చుకుంటాడు? అనేవి తదుపరి ఎపిసోడ్లలో చూడాల్సిందే.