
Maha Shivaratri : శివరాత్రి రోజు ఇంట్లోని పూజా మందిరంలోకి వెళ్లి శివ ధ్యానం చేసిన పిచ్చుక.. వైరల్ వీడియో..!
Maha Shivaratri : మహాశివరాత్రి అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు ఇప్పటివరకు సరైన సమాధానం ఎవరు ఇవ్వలేరు.కానీ మనిషి మాత్రం దైవభక్తితో ఎన్నో రకాల దేవుళ్లకు పూజలు చేస్తూ ఉంటారు.దేవుడు అంటే భక్తి, భయం. అందుకే ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు వెలిశాయి. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఆయా మతస్తులు దైవాన్ని తమ పద్ధతుల్లో పూజిస్తుంటారు. ఇక భారత్ లో భక్తికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే ఇక్కడ అన్ని రకాల దేవుళ్లకు దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ భక్తులు దేవుళ్ళపై ఎంతో నమ్మకాన్ని ప్రదర్శిస్తుంటారు అప్పుడప్పుడు దేవుడు కొన్ని లీలలు చూపిస్తున్నారని గట్టిగా నమ్ముతుంటారు. ఇది ముమ్మాటికి దైవసంకల్పమే అని అంటారు.
అయితే మహాశివరాత్రి సందర్భంగా ఓ పిచ్చుక ఓ ఇంట్లోకి వెళ్లి పూజా మందిరంలో కూర్చుంది. అది అలా కదలకుండా చాలాసేపు కూర్చోవడంతో శివ ధ్యానం చేసిందని భక్తులను నమ్ముతున్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన జగిత్యాల లోని ధర్మపురిలో జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ వీడియోలో ఓ పిచ్చుక ప్రధాన ద్వారం నుండి నేరుగా ఇంట్లోకి చేరి పూజా మందిరంలోకి వెళ్లి కూర్చుంది. చాలా సమయం వరకు కదలకుండా శివ ధ్యానంలో ఉన్నట్లు ఆ పిచ్చుక కూర్చోవడం గమనార్హం.
దీంతో శివరాత్రి సందర్భంగా ఆ పిచ్చుక శివ ధ్యానం చేసేందుకు పూజా మందిరంలోకి వెళ్లిందని భక్తులు నమ్ముతున్నారు. ఇక ఇంట్లోని వాళ్ళు పిచ్చుక ఇంట్లోకి రావటానికి పూజా మందిరంలోకి వెళ్లడాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. దేవుడు పక్షులు, జంతువులు రూపంలో ఇంటికి వస్తాడని అంటారు. శివరాత్రి సందర్భంగా పరమ శివుడే పిచ్చుక రూపంలో ఆ ఇంటికి వచ్చాడని కొందరు భక్తులు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నాస్తికులు దీనిని కొట్టిపారేస్తున్నారు. ఆ పిచ్చుక రోజు ఆ ఇంటికి రావడం అలవాటై ఉంటుందని, పూజ మందిరంలో ఉండే ఫలహారాలను తినేందుకు అది అలా అలవాటై ఉంటుందని, ఆ ఇంట్లోనే వాళ్ళు దానిని అలవాటు చేసుకుని ఉంటారని, శివరాత్రి రోజు వీడియో తీసి ఉంటారని అంటున్నారు.
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…
Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…
Weather Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలతో…
FIFA 2026 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రీడల్లో ఫుట్బాల్ అగ్రస్థానంలో ఉంటుంది. భారత్లో క్రికెట్కు ఉన్న…
Father Pension Money : హైదరాబాద్లో సంచలనం సృష్టించిన పెన్షన్ హత్య కేసులో మల్కాజిగిరి కోర్టు కీలక తీర్పు వెలువరించింది.…
29 Movie Review : ఓటీటీ వేదికల్లో ఇటీవలి కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమాల్లో ‘29’ ఒకటి. తమిళంలో విడుదలైన…
Telangana Womens : తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న…
Pension : ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజంగా అర్హులైన వారికి చేరితే వారి జీవితాల్లో ఎంతో మార్పు తీసుకురాగలవు. ముఖ్యంగా…
Vizag Steel Plant Blast : విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.…
Indian Railways Jobs 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం మరో…
This website uses cookies.