Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. కేవలం సెలబ్రిటీలే కాదు సామాన్య ప్రజలు కూడా ఈ సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు హల్చల్ చేస్తూ ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు మనల్ని నవ్వింప చేసేలా ఉంటాయి. మరి కొన్ని వీడియోలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో లో ఇద్దరు పోలీసులు నడిరోడ్డు పైన కొట్టేసుకున్నారు.
ప్రజల భద్రత ప్రజా అవసరాలు తీర్చే న్యాయవ్యవస్థ అయినటువంటి పోలీసు శాఖ ఇలా నడిరోడ్డుపై కొట్టుకోవడం అందరికీ షాకింగ్ గా అనిపించింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బీహార్ నలంద జిల్లాలోని సోహార్సే పోలీస్ స్టేషన్లోని ఇద్దరు పోలీసులు ఒక కేసు కు సంబంధించి వచ్చిన సొమ్మును పంచుకునే విషయంలో గొడవపడ్డారు. వాహనం లో నుంచి దిగి అందరూ చూస్తుండగానే వారిద్దరూ గొడవపడ్డారు. ఏకంగా ఇద్దరు ఒకరినొకరు దారుణంగా కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఒక పోలీసు అధికారి అయితే ఏకంగా పోలీసు వాహనం లో నుంచి కర్ర తీసుకొని మరి తన తోటి అధికారిని విపరీతంగా కొట్టారు.
అటుగా వెళుతున్న జనాలంతా ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. కొందరు ఆపడానికి ప్రయత్నం చేస్తున్న పోలీసు అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఒకరినొకరు కొట్టుకుంటూనే ఉన్నారు. కాసేపటికి కొందరు వ్యక్తులు పోలీసు అధికారులను ఆపి ప్రయత్నం చేశారు. దీనితో పోలీసు అధికారులు గొడవ పడటం ఆపారు. ఈ తతంగాన్ని మొత్తం అక్కడే ఉన్న ఒక వ్యక్తి తన సెల్ఫోన్ కెమెరాలో బంధించాడు. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త ఇలా వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందించారు.
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
This website uses cookies.