
Tragic Boat : చూస్తుండగానే నీట మునిగిన బోటు... 80కి పైగా మృతి, కొందరు గల్లంతు..!
Tragic Boat : ఇటీవలి కాలంలో బోటు ప్రమాదాలు మనం ఎక్కువగా చూస్తున్నాం. ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కూడా పరిమితికి మించి ప్రయాణికులని ఎక్కించుకోవడం వలన బోటు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా తూర్పు కాంగోలోని కివు సరస్సులో ఘోర ప్రమాదం జరిగింది. పరిమితికి మించి జనాలు బోట్లో ప్రయాణించడంతో పడవ అదుపుతప్పి నీటి మునిగిపోయింది. ఆ పడవలో ఏకంగా 278 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటిదాకా ఏకంగా 87 మంది మరణించారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ విషాద సంఘటన గురువారం నాడు జరిగింది. దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ జీన్-జాక్వెస్ పురుస్సీ ఈ విషయం గురించి తెలిపారు. ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం కిక్కిరిసిన ప్రయాణికులని అధికారులు తెలిపారు. బోటులో దాని సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నారు. దేశంలోని తూర్పు ప్రాంతంలోని కిటు ఓడరేవుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ ఓడ రేవుకు కొన్ని మీటర్ల దూరంలోనే ఈ పడవ మునిగిపోవడం అందరిని బాధిస్తుంది. దక్షిణ కివు ప్రావిన్స్లోని మినోవా నుంచి ఉత్తర కివు ప్రావిన్స్లోని గోమాకు వెళ్తుండగా పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారిని మొదట స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత సుమారు 50 మందిని రక్షించినట్లు తెలుస్తుంది.
Tragic Boat : చూస్తుండగానే నీట మునిగిన బోటు… 80కి పైగా మృతి, కొందరు గల్లంతు..!
పడవలపై రద్దీ అనేది కాంగోలో తరచూ రిపీట్ అయ్యే సమస్య. ఈ సమస్యే ఇటువంటి విపత్తులకు దారి తీస్తుంది. సముద్ర భద్రత నిబంధనలు కూడా అక్కడ పాటించరు. అందుకే ఇలాంటి ప్రమాదాలు కామన్ అయిపోయాయి. ఓడల్లో ఓవర్లోడింగ్ వద్దని అధికారుల చాలా సార్లు హెచ్చరికలు జారీ చేసిన కూడా చాలా మంది ప్రయాణీకులు ఓడల ద్వారానే వెళతారట. ఎందుకంటే ప్రయాణ ఖర్చు తక్కువ. పైగా కాంగోలో రోడ్లు కూడా చాలా తక్కువట. అందుకే అక్కడి ప్రజలు ఎక్కువగా నీటి రవాణాపై ఆధారపడతారు. గతంలో ఇలానే పడవ మునిగిపోవడంతో ఏకంగా 80 మంది మరణించారు. ఈ సంవత్సరం, జనవరిలో 22 మంది మరణించారు. ఇక ఏప్రిల్లో కివు సరస్సులో 64 మంది తప్పిపోయి ఆరుగురు చనిపోయారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కూడా వారిలో మార్పు అనేది రావడం లేదు.
Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…
Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
Kushi Movie Sequel : పవన్ కళ్యాణ్ Pawan Kalyan కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచిన ఖుషి…
Gold and Silver Price 13 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి, పసిడి…
Karthika Deepam 2 March 13th 2026 Today Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న అత్యంత ప్రజాదరణ…
Laddulu : తెలుగు సంప్రదాయ వంటకాలలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రత్యేక స్థానం దక్కించుకున్నది…
Fruits for Hydration : వేసవి కాలం మొదలైతేనే ఎండల తీవ్రత పెరిగి శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. అధిక…
Ugadi astrology, : ఉగాది పండుగతో తెలుగు సంవత్సరానికి శ్రీకారం చుడతారు. కొత్త పంచాంగం ప్రకారం సంవత్సర ఫలితాలను జ్యోతిష్యులు…
This website uses cookies.